క్రికెటర్గా అంత సక్సెస్ఫుల్ కెరీర్ లేకపోయినా…ఐపీఎల్ లో సత్తా చాటి..ఈ మధ్య క్రికెట్కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొన్న ఆ మధ్య జగన్ని కలిసి…గుంటూరు పార్లమెంట్ పరిధిలో తిరగడం మొదలుపెట్టారు. ఆ పరిధిలో రాయుడు..కాపు వర్గం మద్ధతు పెంచుకునేలా రాజకీయం చేస్తున్నారు. అంబటిది ఎలాగో కాపు వర్గమే..దీంతో తన వర్గం మద్ధతు పెంచుకునేలా ముందుకెళుతున్నారు.
పార్లమెంట్ పరిధిలో రంగా విగ్రహాలకు పూలమాలలు వేయడం చేస్తున్నారు. కాపు నేతలని కలుస్తున్నారు. వైసీపీలో కీలకంగా ముందుకెళుతున్నారు. అయితే గుంటూరు ఎంపీ సీటు ఆశించే రాయుడు ఇలా పనిచేస్తున్నారని తెలుస్తుది. అటు వైసీపీ అధిష్టానం కూడా రాయుడుకు నేషనల్ స్థాయిలో పేరుంది కాబట్టి…ఎంపీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
మరి అంబటి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా? అంటే ఆ ఛాన్స్ తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా ఇక్కడ టిడిపి నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత ఉంది. రాజధాని అమరావతి ప్రభావం ఉంది. ముఖ్యంగా జనసేనతో పొత్తు ఉంటే ఇంకా వైసీపీ గెలవదు.
గుంటూరు పరిధిలో…గుంటూరు వెస్ట్, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ సీట్లలో టిడిపికి లీడ్ ఉంది. గుంటూరు ఈస్ట్, తెనాలి, ప్రత్తిపాడులో పోటాపోటి ఉంది. కానీ టిడిపి, జనసేన కలిస్తే ఆ మూడు సీట్లలో కూడా వైసీపీ గెలవలేదు. కాబట్టి రాయుడు ఎంపీగా నిలబడితే గెలుపు కష్టమే.