పనితీరుతో కాకుండా కేవలం మాటలతో గారడీ చేసే మంత్రి అంబటి రాంబాబుకు ఈ సారి గెలుపు అనేది కష్టమయ్యేలా ఉంది. ఎప్పుడు మూడు దశాబ్దాల ముందు ఒకసారి అంటే 1989లో గెలిచిన అంబటికి మళ్ళీ 2019 వరకు విజయం దక్కలేదు. అలాంటి విజయం దక్కినప్పుడు ప్రజలకు సేవ చేస్తూ వారి మద్ధతు ఇంకా పెంచుకుని బలం పెంచుకోవాలి. అలా కాకుండా కేవలం మీడియాలో ప్రతిపక్ష నేతలనే తిట్టడానికే పరిమితమైతే ఉపయోగం ఉండదు.
గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచి రెండో విడతలో మంత్రి అయ్యారు. అది కూడా భారీ నీటి పారుదల శాఖ మంత్రి..మరి ఈ శాఖ పరంగా ఏ పనులు చేస్తున్నారో ఎవరికి తెలియదు. పోలవరం సహ ఇతర ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయో తెలియదు. పోనీ ఎమ్మెల్యేగా సత్తెనపల్లిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలియదు. ఆ సంక్షేమ పథకాలు మాత్రం వస్తున్నాయి. కేవలం ఈయన మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, పవన్లని మాత్రం తిడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రజల మద్ధతు రాదు.
అందుకే ఆయన త్వరగానే వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. దీనికి తోడు..ఈయనకు ధీటుగా టిడిపి నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగుతున్నారు. ఇద్దరు కాపు నేతలే…దీంతో కాపు ఓట్లు చీలతాయి. అటు టిడిపికి జనసేన సపోర్ట్ చేస్తే ఇంకా వన్ సైడ్. గత ఎన్నికల్లో కమ్మ ఓట్లు చీలిపోయాయి. ఈ సారి అవి టిడిపికి వన్ సైడ్. బిసి మెజారిటీ ఓటింగ్ టిడిపి వైపే ఉంటుంది. ఎస్సీ, మైనారిటీ ఒంటింగ్ ఫిఫ్టీ-ఫిఫ్టీ అయితే ఇంకా అంబటి గెలవడం కష్టమే. ఈ దెబ్బతో ఓడితే..మళ్ళీ అంబటి గెలవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో.