ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..అక్కడ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేల చేసే అక్రమాలపై విరుచుకుపడుతున్నారు..10కి 10 సీట్లు ఇస్తే నెల్లూరుని వైసీపీ ఎమ్మెల్యేలు నాశనం చేశారని ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని, తనని ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు. ఇదే సమయంలో హాఫ్ నాలెడ్జ్ ఉన్న అనిల్ తనకు సవాల్ విసురుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ముందు జగన్ దగ్గర నుంచి సీటు తెచ్చుకోవాలని లోకేష్..అనిల్ కు ఛాలెంజ్ చేశారు.
అయితే నెల్లూరులో అనిల్ కు రాజకీయంగా ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే ఆయనపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో ఆయనని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ సైతం యాంటీగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసం నెల్లూరులోని జిల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు అనిల్ కు మైనస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో అనిల్ గడపగడపకు పెద్దగా తిరగడం లేదని జగన్ సర్వేలో తేలింది..ఈ మధ్య సమీక్షా సమావేశంలో 18 మంది సరిగా పనిచేయడం లేదని..వారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతానని జగన్ చెప్పారు.
తాజాగా అనిల్ తో జగన్ మాట్లాడారు..పనితీరు మెరుగుపర్చుకోవాలని క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఇటు అనిల్ సైతం తనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ గురించి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ముందు అందరినీ కలుపుని వెళ్లాలని జగన్..అనిల్ కు క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అనిల్ కు నెక్స్ట్ సీటు ఇచ్చే విషయంపై క్లారిటీ ఇవ్వలేదట. పనితీరు మెరుగు పడితేనే సీటు అన్నట్లు తెలిసింది. దీంతో అనిల్ కు సీటు కష్టాలు మొదలయ్యాయి. ముందు సీటు దక్కుతుందో లేదో డౌట్..అదే జరిగితే లోకేష్ సవాల్ నెగ్గినట్లే.