గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదని అంటున్నారు. ఇక వైసీపీ వచ్చాక గోదావరి జిల్లాలని నాశనం చేశారని, జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని చెబుతున్నారు. టిడిపితో కలిసి గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని వెస్ట్ లో జనసేనకు 5 సీట్లు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం సీట్లతో పాటు మరో రెండు సీట్లు తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక టిడిపితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
2014లో టిడిపికి జనసేన మద్ధతు ఇవ్వడం వల్ల జిల్లాలో 15 సీట్లకు టిడిపి 14 సీట్లు గెలుచుకోగా, పొత్తులో భాగంగా బిజేపికి ఒక సీటు ఇచ్చింది. అలా స్వీప్ చేసేశారు. 2019 లో మాత్రం టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వెస్ట్ లో వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది. టిడిపికి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టిడిపి-జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి.
పొత్తులో టిడిపి 10, జనసేన 5 సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండు పార్టీలు స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్వీప్ అవ్వకపోయిన కనీసం 12-13 సీట్లు మాత్రం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది