వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి నేతలు గాని.. టిడిపి శ్రేణులు గాని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఏమైనా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు, అరెస్టులు చేయడం జరుగుతుంది. ఆఖరికి అదినేత చంద్రబాబుని సైతం వదలలేదు. ఆయన్ని వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా బూతులు తిట్టారు.ఫ్యామిలీని ఎలా కించపర్చారు అనేది అందరికీ తెలిసిందే.
అయితే ఇన్ని జరగడంతో ఈ సారి ఎలాగైనా గెలిచి..తమ సత్తా ఏంటో చూపించాలని తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. అదంతా జరగాలంటే టిడిపి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలి. ఆ దిశగా టిడిపి నేతలు పనిచేయాలి. కానీ కొందరు నేతలు ఆ విషయంలో వెనుకబడి ఉన్నారు. ఎక్కడకక్కడ అంతర్గత పోరుకు దిగుతూ పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు. దీని వల్ల పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయి.
ఇప్పటికే పలు స్థానాల్లో తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ ఉంది. ఈ క్రమంలో కొందరు మారిపోయారు గాని…మరి కొందరు మారడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర తమ్ముళ్ళు పరిస్తితి అంతే. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గాల మధ్య రచ్చ నడుస్తుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా మీ భవిష్యత్తుగా మా గ్యారెంటీ అంటూ టిడిపి నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ క్రమంలో మడకశిరలో బస్సు యాత్ర జరగాలి. కానీ అక్కడ ఈరన్న, తిప్పేస్వామి వర్గాల మధ్య రచ్చ నడుస్తుంది. యాత్రకు ఒకరు వస్తే మరొక వర్గం రానని అంటుంది. దీంతో బస్సు యాత్ర వాయిదా పడింది. ఇదే పరిస్తితి కొనసాగితే మడకశిరలో ఇంకా టిడిపి గెలిచే అవకాశాలే ఉండవు.