గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో టిడిపి కంచుకోటలు కుప్పకూలాయి. జగన్ ఇచ్చిన హామీలని ప్రజలు నమ్మి వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేశారు. అభ్యర్ధి ఎవరు అనేది పెద్దగా పట్టించుకోలేదు. కానీ అలా వన్ సైడ్ గా వైసీపీని గెలిపించిన ప్రజలకు ఒరిగింది పెద్దగా లేదు. పథకాలు ఇస్తున్నారు కొందరికి..పన్నుల భారం అందరికీ అన్నట్లు ఉంది. అభివృధ్ది లేదు. కనీస వసతులు రోడ్లు, తాగునీరు , డ్రైనేజ్ లాంటివి కట్టడం లేదు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు శూన్యం..వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువ.
ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతున్నాయి. అదే సమయంలో టిడిపి, జనసేన పొత్తు ప్రభావం కూడా వైసీపీకి మైనస్. గోదావరి జిల్లాలో వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద మైనస్ ఉంది. మామూలుగా ఉంగుటూరు టిడిపికి అనుకూలమైన స్థానం..1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. 2019లో జగన్ వేవ్ లో పుప్పాల వాసుబాబు దాదాపు 33 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి నేత గన్ని వీరాంజనేయులుపై గెలిచారు.
వాసు ఇన్ని ఓట్ల మెజారిటీ రావడానికి కారణం వైసీపీ వేవ్..జనసేన ఓట్లు చీల్చడం..అలాగే వాసు కాపు వర్గం నేత కావడం..కాపులు జనసేనకు కాకుండా వైసీపీకి భారీగా ఓట్లు వేయడంతో మెజారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యేగా వాసు ఫెయిల్ అవుతున్నారు. అటు కాపులు జనసేన వైపుకు వెళుతున్నారు. అదే సమయంలో టిడిపి నేత గన్ని దూకుడుగా పనిచేస్తున్నారు.
ఓ వైపు ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా పార్టీని బలోపేతం చేస్తూనే..ఉంగుటూరులో టిడిపిని పికప్ చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఈయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ప్రజలు మళ్ళీ గన్ని వైపు చూస్తున్నారు.ఇక జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి..ఉంగుటూరుకు గన్ని ప్లస్ అవుతుంది. ప్రస్తుతం గన్ని లీడ్ లో ఉన్నారని తెలుస్తుంది.