గత ఎన్నికల్లో వైసీపీ గాలిని ఎదురుకుని టిడిపి నుంచి గెలిచింది ముగ్గురు ఎంపీలు మాత్రమే..శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్..వైసీపీ నుంచి గెలిచిన 22 మంది ఎంపీల కంటే ఈ ముగ్గురు పార్లమెంట్ లో రాష్ట్ర గళం బలంగా వినిపిస్తారు. అలాగే తమ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రజలకు అండగా ఉంటారు..అభివృద్ధి పనులు చేస్తారు.
ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు..కానీ రాజకీయంగా టిడిపి నుంచి యాక్టివ్ గా ఉంటూ ఎల్లపుడూ అధినేత చంద్రబాబుకు అండగా ఉండేది ఒక్క రామ్మోహన్ మాత్రమే..మిగతా ఇద్దరు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. అలాగే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న కూడా అంతగా అండగా ఉన్నట్లు కనిపించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి టార్గెట్ గా ఎలాంటి రాజకీయం జరుగుతుందో తెలిసిందే. దీంతో చంద్రబాబు, పార్టీ నేతలు, శ్రేణులు వైసీపీపై పోరాడుతున్నాయి.
కానీ ఆ దిశగా గల్లా, కేశినేని పనిచేస్తున్నట్లు కనిపించలేదు. ఎంపీలుగా వారి పనితీరు అద్భుతంగానే ఉంది. కాకపోతే వారు పార్టీకి ఇస్తున్న సపోర్ట్ ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.
విజయవాడలో కేశినేనికి..అక్కడ స్థానిక నేతలు కొందరితో విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉందని పార్టీ ఉండదు..కాకపోతే అవి ఎలా ఉన్నా..సపోర్ట్ చేయకుండా, పార్టీపైనే విమర్శలు చేయడం..వైసీపీ ఎమ్మెల్యేలకు మద్ధతు పలకడం…పార్టీ బలంతో పాటు సొంత బలంతో గెలిచిన సరే..సొంత బలంతోనే గెలిచామని చెప్పుకోవడం వల్ల..పరోక్షంగా టిడిపికే నష్టం.
మొన్నటివరకు గుంటూరులో లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది..కానీ ఒక్కరోజు కూడా గల్లా పాల్గొన్నట్లు కనిపించలేదు. ఇప్పుడు విజయవాడలో పాదయాత్ర జరుగుతుంది..కేశినేని ఎక్కడ కనిపించడం లేదు. ఇంకా రెండు రోజులు సమయం ఉంది కాబట్టి..ఏమైనా వస్తారా? లేక దూరంగా ఉంటారా? అనేది చూడాలి. మొత్తానికి గల్లా, కేశినేని వ్యవహారం టిడిపిలో ఇబ్బందిగానే ఉంది.
ReplyReply allForward |