సాధారణంగా పంచాయితీ, స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి చూస్తాయి. కానీ ప్రతిపక్ష పార్టీలని అసలు పోటీలో లేకుండా చేయడం, వారిని నామినేషన్లు వేయనివ్వకుండా చేయడం, నామినేషన్ వేయడానికి వస్తే దాడులు చేయడం, పత్రాలు చింపేయడం, నామినేషన్ వేస్తే..బెదిరించడం, పోలీస్ కేసులు, ఉపసమహరించుకునేలా చేయడం..ఇక అధికారుల చేత నామినేషన్లు తిరస్కరించేలా చేయడం..అబ్బో ఇలా ఒకటి ఏంటి..చాలా చిత్రాలు..పంచాయితీ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి వైసీపీ చూపిస్తుంది.
పంచాయితీ, మున్సిపల్, పరిషత్, కార్పొరేషన్ ఇలా ప్రతి ఎన్నికలో అదే రాజకీయం..ఇక వాలంటీర్ల ద్వారా పథకాలు పోతాయని బెదిరించడం, ఓట్లు వేయించడం చేసుకున్నారు. ఇలా రకరకాలుగా చేసి వైసీపీ గెలిచింది. తాజాగా పంచాయితీ ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో కూడా అదే రచ్చ..అక్కడికి ప్రతిపక్ష టిడిపిని పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసుకుంది. తాజాగా 66 పంచాయతీల్లో ముందే 31 సీట్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 1064 గ్రామ వార్డులకు గాను 819 స్థానాలను కూడా ఏకగీవ్రం చేసుకుంది. ఇక 35 పంచాయతీలు, 245 గ్రామ వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల జరిగిన చోట టిడిపి..వైసీపీకి చుక్కలు చూపించింది. 35లో 22 పంచాయితీలు వైసీపీ గెలుచుకుంది..టిడిపి 9, జనసేనతో కలిసి 2 గెలుచుకుంది. అయితే టిడిపి గెలిచిన పంచాయితీలు అంతకముందు వైసీపీ గెలిచినవే..ఇప్పుడు టిడిపి గెలిచిందంటే పరిస్తితులు ఎలా మారుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అటు ఎన్నికల జరిగిన వార్డుల్లో వైసీపీ 140, టిడిపి 90 వార్డులు గెలుచుకుండీ.
ఈ పరిస్తితులని చూస్తుంటే పల్లెల్లో మార్పు కనిపిస్తోంది. ఎక్కువ పంచాయితీల్లో వైసీపీని గెలిపించిన..ప్రభుత్వం మాత్రం గ్రామాల అభివృద్ధి గాలికొదిలేసింది. పంచాయితీ నిధులని మళ్లించుకుంది. ఇలా అన్నీ రకాలుగా పంచాయితీ వ్యవస్థని దెబ్బతీశారు. దీంతో పల్లెల్లో వైసీపీపై తిరుగుబాటు..టిడిపి జోరు కనబడుతోంది.
ReplyReply allForward |