రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చావో రేవో లాంటివి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయని..వైసీపీ వచ్చాక అర్ధమై ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్ధి పార్టీ మనుగడ ఉండకూడదు అని ఎన్ని రకాలుగా టిడిపిని దెబ్బకొట్టడానికి వైసీపీ చూసిందో చెప్పాల్సిన పని లేదు. అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి..చాలా రకాలుగా టిడిపిని దెబ్బతీయడానికి చూసింది.
కానీ అధినేత చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ళు ఎదురు నిలిచి పొరాడి మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్తితుల్లో నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనేది చాలా ముఖ్యం. ఒకవేళ గెలవకపోతే టిడిపి పరిస్తితి ఏం అవుతుందనేది ఊహాకే అందడం కష్టం. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం టిడిపికి ముఖ్యం. అందులో అటు చంద్రబాబు, లోకేశ్, టిడిపి నేతలు బాగా కష్టపడుతున్నారు.
అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బాబు అన్నీ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీని దెబ్బకొట్టి టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి బాబు దగ్గర చివరి అస్త్రం ఒకటి ఉంది..దాంతో మొత్తం తేలిపోతుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఇప్పటికే బలమైన అభ్యర్ధులని నిలిపేందుకే బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా మొహమాటం పడకుండా పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేస్తున్నారు.
అదే సమయంలో పొత్తుల విషయంలో కూడా ఆయన కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వీటితో పాటు అసలైన అస్త్రం మేనిఫెస్టో అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి మేనిఫెస్టో ముఖ్య కారణం..2019 ఎన్నికల్లో జగన్ని గెలిపించడానికి మేనిఫెస్టోనే కారణం. ప్రజలని ఆకట్టుకునే హామీలు ఇవ్వడంతో పాటు. వాటిని అమలు చేసి తీరుతామనే నమ్మకం కలిగించాలి. ఇప్పటికే బాబు..మినీ మేనిఫెస్టో విడుదల చేయగా, దానికి స్పందన బాగా వస్తుంది. ఇక ప్రజారంజక పథకాలు..ఊహించని స్కీమ్లతో బాబు..అసలైన మేనిఫెస్టో రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ దసరా నాటికి మేనిఫెస్టో వదిలే ఛాన్స్ ఉంది. ఆ మేనిఫెస్టోనే టిడిపికి భవిష్యత్ చూపనుంది.