అమరావతి..ఏపీ రాజధాని..జగన్ మూడు రాజధానులు అని చెప్పి..అమరావతిని ఎలా దెబ్బతీశారో తెలిసిందే. కానీ ఇంతవరకు రాజధానికి దిక్కు లేకుండా పోయింది. దీంతో ప్రజలు రాజధాని అంటే అమరావతి అనే అనుకునే పరిస్తితి ఉంది. ఈ సారి ఎన్నికల్లో రాజధాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఒకవేళ జగన్ విశాఖకు వెళ్ళిన ప్రజలు నమ్మే పరిస్తితి ఉండదు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని నమ్మడం లేదు. అక్కడ నుంచి పాలన మొదలుపెట్టిన సరే ప్రజలు..వైసీపీకి మద్ధతుగా నిలవడం కష్టం.
ఇక రాజధాని అంశంలో ప్రజా తీర్పు స్పష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. మెజారిటీ ప్రజలు అమరావతిపై మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. రాజకీయంగా ఇది టిడిపికి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా అమరావతికి చుట్టూ పక్కల ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి సత్తా చాటేలా ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు..అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చేశారో అందరికీ తెలిసిందే. దీంతో అమరావతి పరిధిలో వైసీపీకి యాంటీ ఓ స్థాయిలో ఉంది.
ఇదే సమయంలో అమరావతి ఉద్యమ ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు..రాజధాని ఏరియాలో టిడిపి దెబ్బ గట్టిగా ఉండనుంది. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె, బాపట్ల, గుంటూరు నగరం, ఇటు విజయవాడ నగరం, పెనమలూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
ఈ సీట్లలో టిడిపి గెలుపు సులువు అనే పరిస్తితి కనిపిస్తుంది. ఏదో ఒకటి, రెండు సీట్లు తప్ప..దాదాపు అన్నీ సీట్లలో టిడిపి గెలవడం ఖాయమని తెలుస్తోంది. అమరావతి పరిధిలో టిడిపి స్వీప్ చేసేలా ఉంది.