బాబును అరెస్టు చేసి జైలుకు పంపించగలిగామని వైసిపి నాయకులు గర్వంతో విర్రవీగుతున్నారు. కానీ వారందరూ మర్చిపోయిన చిన్న లాజిక్ ఏంటంటే 73 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఒక పార్టీ లీడర్ ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడితే టీడీపీ నాయకులకే కాదు, కార్యకర్తలకే కాదు సామాన్య ప్రజలకు సైతం ఆయన తప్పు చేశారంటే నమ్మే పరిస్తితి ఉండదు. నాలుగేళ్లుగా వైసీపీ కక్షపూరిత పాలన చూశారు..ఇప్పుడు అదే రీతిలో బాబు అరెస్ట్ అయిందని అందరికీ అర్ధమైంది. బాబు తప్పు చేశారని వాదించడం వేరు, సాక్ష్యాధారాలతో నిరూపించటం వేరు ఇక్కడ బాబు అరెస్టు కక్ష సాధింపు చర్యగానే అందరికీ కనిపిస్తుంది. బాబు అరెస్టు తర్వాత ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనుకున్నారే తప్ప నేరానికి శిక్ష పడింది అని ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశం మొత్తం మీద ఒక్కరు కూడా అనుకోలేదు అంటే వైసీపీ చేసిన పొరపాటు వారికి అర్థమయ్యే ఉంటుంది. బాబును జైలుకు పంపకూడదు, రిమాండ్ ఇవ్వకూడదు అని ఎంతమంది సామాన్య ప్రజలు కోరుకున్నారో అందరికీ తెలుసు.
అరెస్టుతో టిడిపి ఉండదు వైసీపీ అధికారంలోకి మళ్లీ రావచ్చు అని వైసిపి నేతలు ధీమాతో ఉన్నారు. కానీ బాబు అరెస్టే వీరికి శాశ్వతంగా అధికారాన్ని దూరం చేస్తుందనే విషయాన్ని గమనించి లేక పోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల టిడిపిపై పాజిటివ్ పెరిగింది తప్ప ప్రజలలో వ్యతిరేకత అయితే కనిపించడం లేదు.
ఈసారి ఎన్నికలలో వైసీపీకి వైసిపి అభిమానుల ఓట్లు కూడా పడవేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపికి మాత్రం టిడిపి ఓట్లు, టిడిపి సానుభూతిపరుల ఓట్లు, వైసీపీలో వైసిపి నాయకులు చేస్తున్న పనులకు విసిగిపోయిన కిందిస్థాయి క్యాడర్ కూడా టిడిపి వైపే మొగ్గుచూపుతోంది. ఇదంతా లెక్కవేస్తే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి వైసిపి వీరాభిమానుల ఓట్లు తప్ప మరే ఓట్లు రావు. బాబు అరెస్టు వల్ల వైసీపీకి మాత్రం అపార నష్టం జరిగిందని చెప్పవచ్చు.