అవును…కుప్పం నియోజకవర్గంతోనే చిత్తూరు పార్లమెంట్ సీటుని టిడిపి గెలుచుకోనుంది. 2014 ఎన్నికల వరకు అదే జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వాస్తవానికి చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పలమనేరు, పూతలపట్టు లాంటి సీట్లు వైసీపీకి బలమైన సీట్లు. ఇటు నగరి, చిత్తూరు, కుప్పం సీట్లలో టిడిపికి కాస్త పట్టు ఉంది.
అయితే 2014 ఎన్నికల్లో వాటిల్లో చిత్తూరు, కుప్పం మినహా..మిగిలిన సీట్లలో వైసీపీ గెలిచింది. అంటే 5 సీట్లలో గెలిచింది. ఆ లెక్కన చూస్తే చిత్తూరు పార్లమెంట్ సీటు వైసీపీ గెలవాలి. కానీ టిడిపి గెలిచింది. దానికి కారణం కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ. అయితే 2019లో కుప్పంలో బాబుకు మెజారిటీ తగ్గింది. మిగిలిన సీట్లలో వైసీపీకి భారీ మెజారిటీలు వచ్చాయి. దీంతో చిత్తూరు ఎంపీ సీటు వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి కుప్పం కూడా తామే గెలుస్తామని వైసీపీ ఛాలెంజ్ చేస్తుంది. కానీ అంత సీన్ లేదనేది టిడిపి నేతలు అంటున్నారు.
అక్కడ లక్ష మెజారిటీతో గెలవడమే టార్గెట్ గా బాబు పనిచేస్తున్నారు. ఏదేమైనా ఈ సారి కుప్పంలో బాబుకు భారీ మెజారిటీ వచ్చేలా ఉంది. ఇటు నగరి, చిత్తూరు, పలమనేరు సీట్లని టిడిపి గెలిచే ఛాన్స్ ఉంది. పూతలపట్టు, జీడీ నెల్లూరు, చంద్రగిరిలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. కానీ భారీ మెజారిటీలు రావు.
ఈ పరిణామాలు చూస్తే చిత్తూరు ఎంపీ సీటు టిడిపి వశం కావడం ఖాయమే. ఒకవేళ వైసీపీకి మెజారిటీలు పెరిగిన..కుప్పంలో వచ్చే మెజారిటీతో చిత్తూరు సీటు టిడిపికే దక్కే ఛాన్స్ ఉంది.
ReplyReply allForward |