తెలుగుదేశం పార్టీకి ఏపీలో కలగానే మిగిలిన సీట్లు చాలానే ఉన్నాయి. గెలుపుకు దూరమై..గెలవాలని చూస్తూ..ఇప్పటికీ గెలవకపోతున్న సీట్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా 1999 ఎన్నికల నుంచి కొన్ని సీట్లలో టిడిపి గెలుపుకు దూరమైపోయింది. అలాంటి వాటిల్లో కర్నూలు ఎంపీ సీటు కూడా ఒకటి. రెడ్డి సామాజికవర్గంతో పాటు, ఎస్సీల హవా ఉన్న కర్నూలులో మొదట నుంచి కాంగ్రెస్ హవా నడుస్తోంది.
మధ్య మధ్యలోనే టిడిపి గెలిచింది. 1984, 1999 ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది. అంటే అప్పుడు టిడిపి వేవ్ బాగా ఉండటంతోనే గెలవగలిగింది. ఆ తర్వాత నుంచి అక్కడ టిడిపి గెలవలేదు. 2004లో లక్ష, 2009లో 74 వేలు, 2014లో 44 వేలు, 2019లో లక్షా 48 వేల ఓట్లతో టిడిపి ఓడిపోతూ వస్తుంది. కానీ ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెల్చింది. కానీ వైసీపీ గెల్చిన కర్నూలుకు ఒరిగిందేమీ లేదు.
కర్నూలు సమస్యలపై ఎంపీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజల్లో మార్పు వస్తుంది. పైగా కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టిడిపి బలపడుతుంది. ఈ పరిధిలో పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కర్నూలు సిటీ సీట్లు ఉన్నాయి.
వీటిల్లో టిడిపి ఆలూరు, పత్తికొండలో లీడ్ లో ఉంది. కోడుమూరు, ఎమ్మిగనూరులో వైసీపీకి లీడ్ ఉంది. ఇటు మంత్రాలయం, కర్నూలు, ఆదోనిలో పోటాపోటి ఉంది. వీటిల్లో రెండు సీట్లు టిడిపి గెలుచుకునే ఛాన్స్ ఉంది. దీంతో టిడిపికి లీడ్ ఉంటుంది. ఇటు టిడిపి నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బరిలో ఉంటారు. టిడిపి బలం ప్లస్..కోట్ల ఇమేజ్ తో ఈ సారి కర్నూలు ఎంపీ సీటు గెలిచే ఛాన్స్ ఉంది.