ఎలమంచిలి, అనకాపల్లి ఎంపీ సీట్లు..రెండు టిడిపి కంచుకోటలే. ఎక్కువసార్లు టిడిపి జెండా ఎగిరింది. కానీ గత ఎన్నికల్లో రెండు చోట్ల వైసీపీ గెలిచింది. అది కూడా తక్కువ మెజారిటీలతోనే గట్టెక్కింది. పైగా జనసేన ఓట్లు చీల్చడం వైసీపీకి కలిసొచ్చింది. అయితే ఇప్పుడు రెండు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఫుల్ గా ఉంది. ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు.
దీంతో నెక్స్ట్ ఈయనకు సీటు కూడా డౌటే అనే పరిస్తితి. ఇటు అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇక ఈయన గురించి చెప్పాల్సిన పని లేదు. మంత్రిగా ఈయన చేస్తున్న కామెడీ అందరికీ తెలిసిందే. కామెడీ ఎందుకంటే..ఆయన మాటలు అలా అయిపోయాయి. తన శాఖల గురించి పట్టించుకునేది లేదు. ఎంతసేపు చంద్రబాబు, పవన్లని తిట్టడమే. అటు అనకాపల్లికి కూడా చేసేదేమీ లేదు. ఇలా అన్నీ రకాలుగా గుడివాడకు నెగిటివ్ ఉంది. ఇలా రెండుచోట్ల వైసీపీకి మైనస్ ఉంది.
టిడిపి బలపడుతుంది. అదే సమయంలో జనసేన పుంజుకుంటుంది. ఇక టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనేది చర్చగా మారింది. రెండు చోట్ల జనసేన కంటే టిడిపికి డబుల్ బలం ఉంది..కాకపోతే జనసేన సపోర్ట్ ఉంటే ఈజీగా గెలుస్తుంది. అందుకే ఈ సీట్లు తమకు ఇవ్వాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. అయితే ఎలమంచిలిలో జనసేన నుంచి సుదరపు విజయ కుమార్ ఉన్నారు. దాదాపు ఈ సీటు జనసేనకే ఫిక్స్ అవుతుందని అంటున్నారు.
ఇటు అనకాపల్లి విషయానికొస్తే టిడిపిలో పీలా గోవింద్ ఉన్నారు. అయితే ఆయన సీటు వదులుకోవడానికి రెడీగా లేరు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. కాబట్టి ఈ సీటు తమకు ఇవ్వాలని జనసేన అంటుంది. దీంతో ఈ సీటుపై చర్చ నడుస్తుంది. మరి చివరికి అనకాపల్లి ఎవరికి దక్కుతుందో చూడాలి.