టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు, బహిరంగ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజల్లో తిరిగిన బాబుకు ఎక్కడ చూసిన ప్రజలు పెద్ద ఎత్తున మద్ధతు తెలుపుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన చేస్తున్న బాబు..ప్రతి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రతిచోటా బాబు సభకు భారీగా జనం వస్తున్నారు.
తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఊహించని విధంగా అక్కడ సభ భారీ హిట్ అయింది. ఈ మధ్యే ఇంచార్జ్ మర్చిన తెలుగు తమ్ముళ్ళు సమన్వయంగానే ఉంటూ..సభని భారీ సక్సెస్ చేశారు. అయితే రాజానగరం అనేది టిడిపి కంచుకోట. 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి నుంచి పెందుర్తి వెంకటేష్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత ఇంచార్జ్ గా పనిచేశారు. కానీ అనుకున్న మేర పార్టీని బలోపేతం చేయడంలో వెంకటేశ్ సక్సెస్ అవ్వలేదు. దీంతో చంద్రబాబు కొత్త ఇంచార్జ్ని ఫిక్స్ చేశారు.
దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరీని ఇటీవలే ఇంచార్జ్ గా నియమించారు. సరిగ్గా నెల కూడా అవ్వదు. కానీ ఈలోపే చంద్రబాబు రాజానగరం పర్యటనకు రావడం..బొడ్డు ఊహించని విధంగా సభకు తెలుగుదేశం శ్రేణులని సమాయత్తం చేశారు.
ఇక అక్కడ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రాజానగరంలో కమ్మ, కాపు, ఎస్సీ వర్గాలు ఎక్కువ ఉంటాయి. సీతానగరంలో దళిత యువకుడు శిరోముండనం అంశం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ బాధితుడు బాబు సభలో ప్రసాగించాడు. దళితులకు వైసీపీ చేస్తున్న అన్యాయం గురించి చెప్పారు. దీంతో అక్కడ దళితులు వైసీపీకి యాంటీగా ఉన్నారని తేలింది.
ఇటు కమ్మ వర్గాన్ని వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేస్తుందో తెలిసిందే. దీంతో కమ్మ వర్గం పూర్తిగా టిడిపి వైపు ఉంది. ఇక జనసేనతో పొత్తు ఉంటుంది..దీంతో కాపులు టిడిపికి ప్లస్. ఓవరాల్ గా చూస్తే బొడ్డు టిడిపి నుంచి పోటీ చేస్తే రాజానగరంలో గెలవడం పక్కా.