జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని ఎవరైనా సరే వారిని బూతులు తిట్టడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అంటే ప్రభుత్వంలో జరిగే తప్పులని ఎత్తిచూపిన వైసీపీ నేతలు తట్టుకోలేని పరిస్తితి. అవి ప్రజల్లోకి వెళితే తమకు ఇబ్బంది అని చెప్పి..అలా విమర్శలు చేసేవారిని బూతులు తిడతారు. ఇక చంద్రబాబుని ఎన్ని రకాలుగా తిడతారో చెప్పాల్సిన పని లేదు.
పవన్, లోకేష్, పురందేశ్వరి..ఇలా ఎవరైనా ప్రభుత్వంలో తప్పులని ఎత్తిచూపితే వారిపై విరుచుకుపడతారు. తాజాగా చిరంజీవి కూడా సినిమాలపై ఎందుకు రాష్ట్రం గురించి పట్టించుకోండి అని అంటే..ఇంకా ఆయనపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే ఆ మధ్య మన రాష్ట్రం కాదు..కానీ దేశంలోనే గర్వించదగ్గ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చారు. చంద్రబాబు, రజినీ స్నేహితులు అనే సంగతి తెలిసిందే.
అందుకే ఆ చనువుతో బాబు ఆహ్వానంతో విజయవాడ వచ్చారు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు పాలనని పొగిడారు. అంతే ఇంకా జగన్ని ఒక మాట అనలేదు. ప్రభుత్వాన్ని విమర్శించలేదు.
అయినా సరే రజినీని టార్గెట్ చేసి వైసీపీ నేతలు ఎలా బూతులు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. చీకేసిన తాటికాయ మాదిరిగా రజినీ ఉంటారని కొడాలి నాని లాంటి వారు విమర్శలు చేశారు. ఇలా విమర్శలు చేసి మన తెలుగు వారి పరువు తీశారు. అయినా రజినీ ఒక్క మాట పట్టించుకోలేదు. ఇక రజినీకి బాబు ఫోన్ చేసి క్షమాపణ కూడా చెప్పారు. అవన్నీ పట్టించుకోవద్దని రజినీ సూచించారు.
కానీ తాజాగా జైలర్ సినిమా ఫంక్షన్ లో అన్నిటికి ఒకే దెబ్బతో కౌంటర్ ఇచ్చారు. మొరగని కుక్క లేదు..విమర్శించని నోరు లేదు..ఇవి రెండూ జరగని ఊరు లేదు..మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి..అర్ధమైంది రాజా అంటూ..విమర్శలు చేసే ప్రతి ఒక్కరికీ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ మధ్య విమర్శలు చేసిన వైసీపీ నేతలు, వైసీపీ పేటీఏం చిల్లర గాళ్లకు రజిని ఒక్క దెబ్బతో కౌంటర్ ఇచ్చేశారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి రజినీ కౌంటర్లు వైసీపీకి గట్టిగానే తగిలాయి.