పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ కంచుకోటలుగా చెప్పుకుంటున్న వినుకొండ, మాచర్ల, గురజాలలో ఊహించని విధంగా పాదయాత్రలో ప్రజలు వస్తున్నారు. బహిరంగ సభల్లో భారీగా జనం వస్తున్నారు. మొన్నటివరకు ప్రకాశం జిల్లాలోనే భారీగా వచ్చారు. అనుకుంటే దానికి మించి పల్నాడులో సత్తా చాటుతున్నారు.
ఇక గురజాలలో ఊహించని విధంగా సభ జరిగింది. ఈ దెబ్బతో గురజాలలో టిడిపి జెండా ఎగరడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అయితే గురజాల అంటే టిడిపికి పట్టున్న సీటు. కాకపోతే గత ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. 1983, 1985, 1994, 2009, 2014 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి విజయం సాధించింది. ఇందులో మూడుసార్లు టిడిపి నుంచి యరపతినేని శ్రీనివాసరావు గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి గెలిచారు. ఇక కాసు వల్ల గురజాలకు ఒరిగింది ఏమి లేదు. పైగా అక్కడ అక్రమాలు, అరాచకాలు ఎక్కువ అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
అయితే అక్కడ అన్నీ అంశాలు ప్రజలకు అర్ధమవుతున్నాయి. అదే సమయంలో యరపతినేని దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ, వైసీపీపై పోరాటం చేస్తూనే, ప్రజా సమస్యల పై గళం విప్పుతున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర భారీ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి కృషి చేశారు. ఈ పరిణామాలు గురజాలలో టిడిపికి పెద్ద హెల్ప్ అవుతున్నాయి.
అటు ఎమ్మెల్యే కాసు..స్థానికేతరుడు కావడం, అక్కడ వైసీపీలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..కాసుకు పడటం లేదు. ఇలా వైసీపీలో గ్రూప్ వార్ జరగడం టిడిపికి అడ్వాంటేజ్. మొత్తం మీద ఈ సారి గురజాలలో టిడిపి గెలుపు పక్కా అని చెప్పవచ్చు.