ఒక జిల్లాని మించి ఒక జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతూ వస్తుంది. మొదట చిత్తూరులో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు బాగా వచ్చింది. తర్వాత అనంతపురం, కర్నూలు, కడప….ఆ తర్వాత నెల్లూరులో రాయలసీమకు మించిన మద్దతు వచ్చింది. ఇంకా అదే టాప్ అనుకున్నారు. కానీ దానికి మించి ప్రకాశంలో బ్రహ్మరథం పట్టారు. మొన్నటివరకు ప్రకాశంలోని అద్దంకి టాప్ అనే పరిస్తితి.
కానీ దానికి మించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మొదట వినుకొండ, దానికి మించి మాచర్ల..దాన్ని దాటేసి గురజాల…ఇప్పుడు సత్తెనపల్లి, పెదకూరపాడుల్లో సత్తా చాటుతున్నారు. ఇలా వైసీపీ స్వీప్ చేసిన పల్నాడులో లోకేష్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అవ్వడానికి సిక్స్ రీజన్స్ ఉన్నాయనే చెప్పవచ్చు. మొదట..ప్రజలతో మమేకమవుతున్న లోకేష్ తీరు..ఆయన మంచి ప్రజా నాయకుడుగా ఎదుగుతున్నారు. ఆయన కోసం జనం భారీగా వస్తున్నారు.
రెండు.. వైసీపీపై వ్యతిరేకత..ప్రభుత్వంపై వ్యతిరేకతకు పాదయాత్ర ఓ నిదర్శనం. మూడు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల తీరు, అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం..వీటిపై ప్రజలు తిరుగుబాటు మొదలైంది. నాలుగు.. పల్నాడులో బలంగా ఉన్న టిడిపి కేడర్..వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని రకాలుగా దాడులు చేసిన టిడిపి కేడర్ తగ్గలేదు. ఇంకా కసితో ఉన్నారు.. ఆ కసి మొత్తం లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేస్తున్నారు.
ఐదు..ఆకట్టుకుంటున్న టిడిపి మినీ మేనిఫెస్టో..అందులో అద్భుతమైన పథకాలు ప్రకటించారు. ఈ పథకాలు అమలు కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలి..అందుకే పాదయాత్రకు ప్రజా మద్ధతు. ఇంకా చివిరిది..ఆరో కారణం..పల్నాడులో లోకేష్ తో పాటు టిడిపిలో ఉన్న మాస్ నాయకులు..జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి లాంటి మాస్ నేతలు..భారీగా మాస్ జనం పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు.