చంద్రబాబు రోడ్ షోలకు, బహిరంగ సభలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ పాలన పట్ల ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చిందో అప్పటినుంచి ప్రజల్లో మార్పు కనిపించింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళుతున్న బాబుకు ప్రజల మద్ధతు పలకడం మొదలైంది. బాదుడే బాదుడు రాయలసీమ నుంచే బాబు విజయయాత్ర మొదలైంది.
తాజాగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలించి..ఎక్కడకక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆ సభలు విజయవంతంగా కొనసాగుతూ వచ్చాయి. తాజాగా వైసీపీ కంచుకోట పాతపట్నంలో బాబు సభ ఏర్పాటు చేస్తే..ఊహించని విధంగా రోడ్లు నిండిపోయి ప్రజలు పెద్ద ఎత్తున బాబుకు మద్ధతు తెలిపారు. ఈ స్థాయిలో పాతపట్నంలో తిరుగుబాటు మొదలుకావడంతో టిడిపి విజయానికి కొత్త మలుపు వచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా పాతపట్నం టిడిపి కంచుకోటే. 1983, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో టిడిపి అక్కడ గెలిచింది. కానీ 2008లో నియోజకవర్గాల పునర్విభజన చేసి..కాంగ్రెస్కు పట్టు ఉండే కొన్ని మండలాలని కలిపి పాతపట్నం నియోజకవర్గం ఏర్పాటు చేశారు.
దీంతో 2009 ఎన్నికల్లో పాతపట్నంలో కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో కూడా గెలుపు దగ్గరకొచ్చి 3,800 ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఓడిపోయింది. ఇలా వరుసగా టిడిపి ఓడిపోతూ వస్తుంది. ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. టిడిపికి బలం పెరుగుతూ వస్తుంది.
అందుకే ఇప్పుడు పాతపట్నంలో బాబు సభకు భారీగా జనం వచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితుల్లోనైనా పాతపట్నంలో పసుపు జెండా ఎగిరేలా ఉంది.