అధికారంలో ఉంటే ఇంకా తమకు ఎదురులేదని..ఇంకా జీవితాంతం తమదే గెలుపు…అధికారంలో ఉండేది తామే అనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారని విశ్లేషకులు గట్టిగానే చెబుతున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని, అదే వైసీపీని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. అధికార బలంతో టిడిపిని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలని చూస్తున్నారు..అంతే ఇదిగా టిడిపి బలపడుతుందని అంటున్నారు.
ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రాజకీయంగా ఆధిపత్యం కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార బలం ఏ స్థాయిలో వాడుతున్నారో అందరికీ తెలుసని, ఆ బలాన్ని ప్రజలకు మేలు చేసేలా వాడితే బాగానే ఉంటుందని, కానీ టిడిపిని అణగతోక్కేందుకు వాడుతున్నారని, అదే టిడిపి పుంజుకోవడానికి కారణం అవుతుందని అంటున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, పుంగనూరు, తంబళ్లపల్లెలో జరిగిన దాడులకు కారణం ఎవరో తెలుసని, ఇక పోలీసుల సపోర్ట్ తో వైసీపీ ఏం చేసిందో తెలుసని, కానీ రివర్స్ లోనే టిడిపి నేతలపైనే కేసులు పెట్టారని, చాలావరకు టిడిపి శ్రేణులని అరెస్ట్ చేశారని, ఈ అంశాలు రాజకీయంగా టిడిపికి మైలేజ్ పెంచుతాయే తప్ప తగ్గించవని చెప్పుకొస్తున్నారు.
అక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు..కానీ టిడిపిని కావాలని టార్గెట్ చేశారని, ఆఖరికి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారని, అంటే అధికార బలం అనేది ఎలా చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక చిత్తూరులో దూకుడుగా ఉన్న టిడిపి నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి వారిని అణిచివేస్తే..టిడిపిని దెబ్బతీయవచ్చు అని చూస్తున్నారని, వారిని అరెస్ట్ చేయాలని పావులు కదుపుతున్నారని తెలిసింది.
ఒకవేళ వారి అరెస్టులు జరిగితే టిడిపికి జరిగే నష్టమేమీ లేదు..కానీ వారిపై ఇంకా సానుభూతి పెరిగి..ప్రజా మద్ధతు పెరుగుతుందని, దీంతో ఆ ముగ్గురు నేతలకు తిరుగుండదని అంటున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి..ఆ టిడిపి నేతలకు మైలేజ్ పెంచుతున్నారని చెబుతున్నారు.