అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన సరే..గత ఎన్నికల్లో ఆ ప్రాంతంలో టిడిపి దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఏ విధంగా దెబ్బతీశారో తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇక వైసీపీ బలహీనపడింది. టిడిపి గెలుపుకు దగ్గరైంది.
అయితే మంగళగిరిలో లోకేష్ పోటీ చేయడం ఖాయం..గెలుపు నల్లేరు మీద నడకే..కానీ తాడికొండ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఈ రిజర్వ్ సీటులో పోటీ చేసే అభ్యర్ధిపై క్లారిటీ రావడం లేదు. 2014లో తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేసి గెలిచారు. 2019లో ఓడిపోయారు. ప్రస్తుతానికి ఇంచార్జ్గా ఉన్నారు. కానీ ఆయనకు సీటు గ్యారెంటీ లేదనే ప్రచారం వస్తుంది. ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికిపూడి శ్రీనివాసరావుకు ఆ సీటు ఇస్తారని ప్రచారం వస్తుంది. ఇలా ప్రచారం జరుగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..చంద్రబాబుని కలవడం సంచలనంగా మారింది. ఆమె టిడిపిలోకి రావడానికి సిద్ధమయ్యారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆమె..తాడికొండకు చేసిందేమి లేదు. పైగా అమరావతి ఉద్యమానికి మద్ధతు ఇవ్వలేదు. అయితే వైసీపీలో నెక్స్ట్ ఆమెకు సీటు లేదని తేలింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటు చేశారని చెప్పి..ఆమెని వైసీపీని సస్పెండ్ చేసింది. ఇక వైసీపీ శ్రేణులు ఆమెపై మాటల దాడి చేశాయి.
దీంతో కొన్ని రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆమె..బాబుని కలిశారు. అలాగే లోకేష్ పాదయాత్ర తాడికొండలో ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆమె టిడిపిలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. మరి టిడిపిలోకి వస్తే ఆమెకు సీటు ఇస్తారా? అంటే అది డౌటే. పోనీ బాపట్ల ఎంపీ సీటు ఇస్తారా? అంటే చెప్పలేం. మొత్తానికి శ్రీదేవి ఎంట్రీతో తాడికొండ సీటుపై కన్ఫ్యూజన్ మొదలైంది.