సాగునీటి ప్రాజెక్టులని వైసీపీ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది…సాగునీరు అందక రైతులు ఎలా ఇబ్బంది పడతారు. పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఎలా కాలం గడిపేస్తున్నారు..ఇలా ప్రతి అంశం ప్రజలకు తెలిసేలా..టిడిపి అధినేత చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి అంటూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు బాబు పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బాబు పర్యటనకు సూపర్ సక్సెస్ అయింది. అలాగే బహిరంగ సభలకు భారీగా జనం వస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా బాబు గోదావరి జిల్లాల్లో పర్యటించారు. చింతలపూడి, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులని పరిశీలించారు. అలాగే గోపాలాపురంలోని దేవరపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే బాబు గోదావరి టూర్ భారీ హిట్ అయింది. ఎక్కడకక్కడ బాబు అనుకున్న విధంగా వైసీపీ చేస్తున్న తప్పులని ఎత్తి చూపడంలో సక్సెస్ అయ్యారు. బాబు టూర్ సూపర్ సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదట బాబు పర్యటించిన రోజే..జగన్ కూడా గోదావరి జిల్లాలో పర్యటించారు. పోలవరం ముంపు బాధితులని పరామర్శించడానికి వచ్చారు. ఇక పరామర్శించడానికి వచ్చి..తాను ఏమి సాయం చేయలేనని, అంతా కేంద్రమే చేయాలని చెప్పారు. ఇక జనం తరలించిన..జగన్ పర్యటన పట్ల జనం ఆసక్తి చూపలేదు. ఇక మొత్తం ఫోకస్ బాబు పోలవరం పర్యటనపైనే ఉంది. అక్కడ వైసీపీ చేసిన నిర్లక్ష్యాన్ని బాబు సోలోగా కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఎందుకంటే పోలవరం సందర్శనకు మిగతా టిడిపి నేతలకు పర్మిషన్ ఇవ్వలేదు. బాబు ఒక్కరే వెళ్లారు. ఇక ఏలూరు నుంచి మొదలైన బాబు రోడ్ షో..గోపాలాపురం వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇక రాత్రి పది గంటలైన గోపాలాపురంలో బాబు సభకు భారీగా జనం తరలివచ్చారు. సభ అయ్యేవరకు నిలబడ్డారు. ఇది పెద్ద హైలైట్ అయింది. ఇలా బాబు గోదావరి టూర్ సూపర్ సక్సెస్ అయింది..ఇది వైసీపీపై వ్యతిరేకతకు నిదర్శనం.