తెలుగుదేశం పార్టీకి గెలుపోటములు కొత్త కాదు..అనేక సంచలన విజయాలు సాధించింది..అలాగే ఓటములు కూడా చవిచూసింది. అన్నీ రకాల సంక్షోభాల నుంచి బయటపడి మళ్ళీ అధికారం దక్కించుకుంది. ఇక టిడిపి పని అయిపోయిందని ప్రత్యర్ధులు మాట్లాడిన ప్రతిసారి..సత్తా చాటుతూనే వచ్చింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి టిడిపిని బాగా దెబ్బతీసింది. పైగా అధికారంలోకి వచ్చిన జగన్..టిడిపిని ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారో..టిడిపి అనేది లేకుండా చేయడానికి రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారో తెలిసిందే.
దీంతో టిడిపి మునిగిపోయే నావ అని..ఇంకా పార్టీ కనుమరుగైపోతుందని మాట్లాడారు. కానీ అలాంటి దారుణమైన సంక్షోభం నుంచి సైతం టిడిపి బయటపడి..ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టి అధికారం సాధించే దిశగా ముందుకెళుతుంది. టిడిపిని మళ్ళీ రేసులో నిలబెట్టడానికి అధినేత చంద్రబాబు ఎంత కష్టపడుతూ వచ్చారో చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు ఎలా బూతులు తిట్టారు..ఎగతాళి చేశారు..అవమానాలకు గురి చేశారో తెలిసిందే. అయినా సరే వెనక్కి తగ్గలేదు. పార్టీని నిలబెట్టడం కోసం కష్టపడ్డారు.
వయసు అయిపోయింది..ముసలోడు అంటూ ఎగతాళి చేశారు. వయసు శరీరానికే మనసుకు కాదని నిరూపించి..ఇప్పటికీ కష్టపడుతున్నారు. అటు పప్పు పప్పు అంటూ లోకేష్ని ఎలా ఎగతాళి చేశారో తెలిసిందే. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తూ..ప్రజా మద్ధతు దక్కించుకున్నారు. నిప్పు మాదిరిగా తయారై…వైసీపీని టెన్షన్ పెడుతున్నారు. ఇలా టిడిపిని గెలిపించడం కోసం బాబు, లోకేష్ పోరాడుతూనే ఉన్నారు.
అయితే ఇలా పోరాడుతున్న సరే కొందరు టిడిపి నేతలు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు. పార్టీ గాలి ఉంటే గెలిచేస్తాంలే అనే ధీమాలో ఉండిపోతున్నారు. పైగా కొన్ని స్థానాల్లో సీటు కోసం ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఈ అంశాలు టిడిపికి మైనస్ అవుతున్నాయి. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు నెగిటివ్ ఉన్నా సరే..టిడిపికి పాజిటివ్ ఉండటంలేదంటే..టిడిపి నేతలే కారణం అని చెప్పవచ్చు. ఇకనైనా వారు కూడా కష్టపడితే..రానున్న ఎన్నికల్లో పసుపు జెండా ఎగరడం ఖాయం.