2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం అనేది టిడిపికి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ గాని ఓడిపోయి అధికారం కోల్పోతే ఇంకా టిడిపి మనుగడకే ప్రమాదం..మరోసారి జగన్ అధికారంలోకి వస్తే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహాకే చిక్కదు. కాబట్టి ఈ సారి టిడిపి అధికారంలోకి రావడం అనేది కీలకం. అయితే రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. అలాంటప్పుడు టిడిపి ఖచ్చితంగా గెలిచేసి అధికారంలోకి వచ్చేస్తుందని ఖచ్చితంగా చెప్పే పరిస్తితి ఉందా? అంటే అలా కనిపించడం లేదు.
ఎందుకంటే వైసీపీ వైఫల్యలాలని ప్రజల్లోకి తీసుకెళ్లి, టిడిపి బలాన్ని పెంచడంలో కొందరు ఇంచార్జ్లు ఫెయిల్ అవుతున్నారు. దీని వల్ల టిడిపి ఇంకా వెనుకబడి ఉంటుంది. పైగా కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ..టిడిపి గెలుపుకు దూరమైన స్థానాలు చాలానే ఉన్నాయి. ఆ స్థానాల్లో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే..అక్కడ ఉన్న ఓటర్లని టిడిపి వైపుకు తిప్పుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్తితులు వల్ల టిడిపి ఇంకా కొన్ని జిల్లాల్లో వెనుకబడి ఉంది.
అలా వెనుకబడిన వాటిల్లో ముందుగా కడప చెప్పుకోవచ్చు. 1999 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి సత్తా చాటింది. తర్వాత కాంగ్రెస్, వైసీపీలు గెలుస్తున్నాయి. కానీ ఆ రెండు పార్టీల వల్ల కడపకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు..అయినా సరే టిడిపి ఆ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది. దీని వల్ల కడపలో 80 శాతం వైసీపీకే ఆధిక్యం ఉంది.
ఇక కర్నూలులో కూడా అలాంటి పరిస్తితే. కాకపోతే గత ఎన్నికల మీద ఇప్పుడు టిడిపి పరిస్తితి పర్లేదు. అయితే ఇప్పటికీ ఇక్కడ టిడిపి వెనుకబడే ఉంది. ఇటు చిత్తూరులో కూడా వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంటే..టిడిపి వెనుకబడి ఉంది. నెల్లూరులో ఇప్పుడు కాస్త వైసీపీకి టిడిపి పోటీ ఇస్తుంది. అయినా సరే ఆధిక్యం వైసీపీ వైపే ఉంది. అటు పట్టు ఉన్న గుంటూరు-కృష్ణా జిల్లాల్లో పూర్తి ఆధిక్యంలోకి రాలేదు. గోదావరి జిల్లాల్లో జనసేనతో పొత్తు బట్టి ఆధిక్యం ఆధారపడి ఉంది. ఉత్తరాంధ్రలో హోరాహోరీ ఉంది. టిడిపి అధికారంలోకి రావాలంటే ఆధిక్యంలోకి రావాల్సిందే.