విశాఖ సిటీ..తెలుగుదేశం పార్టీ కంచుకోట…సిటీలో మొదట నుంచి టిడిపి సత్తా చాటుతూనే ఉంది. గత రెండు ఎన్నికల్లో స్వీప్ చేస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా సరే సిటీలో టిడిపి హవా నడిచింది. సిటీలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు టిడిపి గెలిచింది.
ఈస్ట్ లో వెలగపూడి రామకృష్ణ, వెస్ట్ లో గణబాబు, సౌత్ లో వాసుపల్లి గణేశ్, నార్త్ లో గంటా శ్రీనివాసరావు గెలిచారు. అయితే వాసుపల్లి…వైసీపీలోకి వెళ్లారు. ఇక విశాఖ సిటీలో టిడిపికి చెక్ పెట్టడానికి వైసీపీ అధికార బలాన్ని గట్టిగానే వాడుతుంది. టిడిపి నేతలని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. విశాఖ కార్పొరేషన్ని సైతం వైసీపీ గెలుచుకుంది. అలా వైసీపీ సిటీపై పట్టు సాధించే దిశగా వెళుతుంది. అలాగే రాజధాని పేరుతో రాజకీయం నడిపిస్తుంది.
అయితే ఎన్ని చేసిన వైసీపీని విశాఖ ప్రజలు నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. రాజధాని పేరుతో భూ అక్రమాలు, దోపిడీలు పెరిగాయని, అలాగే అభివృద్ధి చేసేది ఏమి కనిపించడం లేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో సిటీలో మళ్ళీ టిడిపి పై చేయి సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి..ఒక సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. నగరంలో నాలుగు సీట్లలో టిడిపికి ఆధిక్యం ఉంది..అదే సమయంలో జనసేనకు 20 వేల ఓటు బ్యాంకు వరకు ఉంది.
దీంతో టిడిపి-జనసేన కలిస్తే విశాఖ సిటీలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు..మళ్ళీ టిడిపి పట్టు సాధించడం ఖాయం.