ఎన్నికల ముందు కుట్రలు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని, కానీ ఆ కుట్రలని టిడిపి ఎంతవరకు ఎదురుకుంటుందనేది ప్రధానమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ ఎన్ని రకాలుగా కుట్రలు చేసిందో అందరికీ తెలుసని, కానీ అప్పుడు అధికారంలో ఉంటూ కూడా టిడిపి కుట్రలని చేధించడంలో విఫలమైందని దీని వల్ల వైసీపీ గెలిచిందని చెబుతున్నారు.
ఈ సారి ఎన్నికల్లో అలాంటి కుట్రలకే వైసీపీ తెరతీసింది..ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయించడం అని అంటున్నారు. గత ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి చంద్రబాబుని ఎలా నెగిటివ్ చేశారో తెలిసిందే. అప్పుడు టిడిపి అధికారంలో ఉంటూ కూడా సినిమాని అడ్డుకోలేదు. అంటే అలాంటి కుట్రలు టిడిపికి పాల్పడలేదు. సినిమాని సినిమాగానే భావించారు. కానీ దాని ద్వారా వైసీపీ లబ్ది పొందింది. ఇప్పుడు వర్మ మళ్ళీ సినిమా తీస్తున్నారు. వ్యూహం, శపథం అంటూ రెండు పార్టులుగా రాష్ట్ర రాజకీయాలపై సినిమా తీస్తున్నారు.
ఇక సినిమా స్టోరీలు ఏమైనా కానీ..అందులో జగన్ క్యారెక్టర్ పాజిటివ్గా, చంద్రబాబు, లోకేష్, పవన్ క్యారెక్టర్లు నెగిటివ్ గా ఉండటం ఖాయం. పైగా అన్నీ తెలిసిన నిజాలే చెబుతానని వర్మ అంటున్నారు..కానీ అందులో జగన్కు అనుకూలంగా అబద్దాలానే నిజాలుగా చెబుతారు. సినిమాలో వివేకా హత్య కేసు కూడా ఉంటుందని అంటున్నారు.
ఆ హత్య లో పాత్ర ఎవరికి ఉందో రాష్ట్రమంతా తెలుసు..కానీ దానికి మాసిపూసి మారేడు కాయ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు వ్యతిరేకంగా టిడిపి నేతలు గళం విప్పుతున్నారు. దేవినేని ఉమా అయితే నిరసన తెలియజేశారు. ఇలా చేయడం వల్ల వర్మ సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే టాక్ కూడా ఉంది. అలాంటప్పుడు సినిమాలని పట్టించుకోకుండా ఉంటే బెటర్ అనే మాట వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల మాదిరిగా ప్రజలు మోసపోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు నిజనిజాలు అన్నీ తెలుసు. అలాగే సినిమాని వైసీపీ వాళ్ళు తప్ప..మరొకరు చూడరు. దీని వల్ల ఓట్లు ఏమి మారిపోవు. కాబట్టి వర్మ సినిమాల గురించి తెలుగు తమ్ముళ్ళు లైట్ తీసుకుంటే బెటర్.