చంద్రబాబు-పవన్ పొత్తు దిశగానే వెళుతున్నారా? నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి-జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? అంటే ఏమో ఏమైనా జరిగే ఛాన్స్ ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే పొత్తులపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు-పవన్ మూడుసార్లు కలిశారు. దీంతో పొత్తు ఉంటుందని అంతా డిసైడ్ అయ్యారు. అలాగే వైసీపీ వ్యతిరేకత ఓట్లని చీల్చనివ్వను అని పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. వైసీపీని గద్దె దించాలంటే సిఎం పదవి త్యాగం చేయాల్సి ఉంటుందని కూడా అన్నారు.
దీంతో టిడిపి-జనసేన పొత్తు స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇటీవల పవన్ రూట్ మార్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేనకు అధికారం ఇవ్వాలని, తనని సిఎం చేయాలని పవన్ వారాహి యాత్రలో ప్రజలని కోరుతున్నారు. ఈ క్రమంలో పొత్తుపై కాస్త కన్ఫ్యూజన్ వచ్చింది. ఇటు చంద్రబాబు అయితే పొత్తుల గురించే మాట్లాడటం లేదు. టిడిపిని బలోపేతం చేయడంపైనే ఆయన ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. దీంతో పొత్తు ఉంటుందా? లేదా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. వాస్తవానికి ఈ కన్ఫ్యూజన్ వైసీపీలోనే ఎక్కువ ఉంది.
పొత్తు ఉంటే వారికే నష్టం…పొత్తు లేకపోతే లాభం..అయితే పొత్తు ఉంటే చెడగొట్టేలా వైసీపీ రాజకీయం చేస్తుంది. ఇప్పుడేమీ క్లారిటీ లేకపోవడంతో వైసీపీకి ఏమి అర్ధం కావడం లేదు. కానీ బాబు-పవన్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నారని తెలుస్తుంది. మొదట ఎవరికి వారు సొంతంగా తమ పార్టీలని బలోపేతంచేసుకునే పనిలో ఉన్నారు. అలా పార్టీలు బలపడ్డాక..ఎన్నికల ముందు పొత్తులపై డిసైడ్ అవుతారు. అయితే దాదాపు పొత్తు మాత్రం ఫిక్స్ అనే చెప్పవచ్చు. కాకపోతే అది ఎన్నికల ముందు తేలుస్తారు..అప్పటివరకు వైసీపీని కన్ఫ్యూజన్ లోనే పెడతారు.