ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటేనే టిడిపికి పెద్ద పట్టు లేని జిల్లా..మొదట నుంచి ఇక్కడ టిడిపి గొప్ప విజయాలు ఏమి అందుకోలేదు. దీంతో అక్కడ టిడిపికి ఏది కలిశారలేదు. ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ హవా నడుస్తుంది. అలా వైసీపీ హవా ఉన్న నెల్లూరులో ఇప్పుడు టిడిపి లీడ్ దిశగా వెళుతుంది. ఇప్పటికే వైసీపీకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలని టిడిపి వైపుకు తీసుకున్నారు. అలాగే నారా లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు.
దీంతో నెల్లూరులో టిడిపి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం ఉన్న 10 సీట్లలో 5 చోట్ల టిడిపి లీడ్ లోకి వచ్చింది. అలా టిడిపి లీడ్ లోకి వచ్చిన స్థానాల్లో కావలి కూడా ఒకటి. మొదట నుంచి ఇక్కడ టిడిపికి బలం తక్కువ. అసలు ఇక్కడ గెల్చింది కేవలం రెండుసార్లు మాత్రమే. 1999, 2009 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లో పనితీరు బాగోక వెనుకబడిన వారిలో ప్రతాప్ ముందే ఉన్నారు. ఈయనకు పెద్ద పాజిటివ్ లేదు. పైగా కావలిలో అక్రమాలు ఎక్కువనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో టిడిపి అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతుంది.
ఈ సారి ఇక్కడ టిడిపి హవా నడిచేలా ఉంది. అయితే టిడిపి నుంచి ఎవరు బరిలో ఉంటారో ఇంకా క్లారిటీ లేదు. ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఉన్నారు కానీ..ఆయనకు సీటు దక్కే ఛాన్స్ లేదు. అటు కావ్య కృష్ణారెడ్డి సీటు ట్రై చేస్తున్నారు. మొత్తానికి సీటు ఎవరికి దక్కిన కావలిని టిడిపి సొంతం చేసుకునేలా ఉంది.