మామూలుగా కమ్మ వర్గం అంటే..టీడీపీ అనే విధంగా ముద్రపడిపోయింది. కానీ అందులో వాస్తవంలేదని చాలా సార్లు రుజువైంది. టిడిపిని దెబ్బతీయడానికి కమ్మ పార్టీ అనే ముద్రవేసేవారు తప్ప..టిడిపిలో అన్నీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో దాదాపు 40 శాతం కమ్మ వర్గం ఓట్లు వైసీపీకి పడ్డాయి. అలాంటిది కమ్మ వర్గం మొత్తం టిడిపికే మద్ధతు అనేది కరెక్ట్ కాదనే చెప్పాలి.
కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. వైసీపీలో కమ్మ నేతలు, కమ్మ వర్గం మద్ధతు ఉందని తెలిసి కూడా ..అదే వర్గాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. దీని వల్ల నిదానంగా వైసీపీకి ఓటు వేసిన కమ్మ వర్గంలో మార్పు వస్తుంది. ఇదే క్రమంలో కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గంలో మార్పు గట్టిగానే కనిపిస్తుంది.
ఇది ఎస్సీ రిజర్వడ్ స్థానం..ఇక్కడ ఎస్సీ ఓట్లతో పాటు కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ. ఆ రెండు వర్గాలే గెలుపోటములని ప్రభావితం చేస్తాయి. అయితే గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సుధాకర్ బాబు గెలిచారు. ఆయన గెలుపుకు ఎస్సీలతో పాటు కమ్మ ఓట్లు కీలకం. కానీ గెలిచాక ఏ వర్గాన్ని పట్టించుకునేది లేదంటే సుధాకర్ బాబు ముందుకెళుతున్నారు.
కావల్సిన కొంతమందికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. దీంతో ఆయనకు యాంటీ పెరిగింది.ముఖ్యంగా కమ్మ వర్గం చాలా యాంటీ అయింది. గత ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ కమ్మ ఓట్లు సుధాకర్ బాబుకు పడ్డాయి. అయినా సరే వైసీపీలో సుధాకర్ గెలుపు కోసం కష్టపడ్డ కమ్మ నేతలని పట్టించుకోవడం లేదట. దీంతో వారు ఎమ్మెల్యేకు యాంటీ అయ్యారు. మళ్ళీ సుధాకర్కు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. మొత్తానికి సుధాకర్ బాబుకు ఈ సారి కమ్మని షాక్ తగిలేలా ఉంది.