గత ఎన్నికల్లో రూరల్ ప్రాంతంలో టిడిపి దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. పూర్తిగా వైసీపీ హవా నడిచింది. కానీ ఇప్పుడు నిదానంగా సీన్ మారుతుంది. రూరల్ లో టిడిపి బలపడుతుంది. ఈ సారి రూరల్ లో టిడిపి సత్తా చాటేలా ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని రూరల్ ప్రాంతంలో ఈ సారి టిడిపి హవా ఉండేలా ఉంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలోనే టిడిపి గెలిచింది. రూరల్ లో దారుణంగా ఓడింది.
ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో టిడిపి చావు దెబ్బతింది. కంచుకోట ల్లాంటి స్థానాల్లో కూడా టిడిపికి ఊహించని ఓటమి ఎదురైంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం సీట్లు ఉన్నాయి. ఈ ఏడు సీట్లలో టిడిపి ఓడింది. వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. టిడిపి గెలుపు దిశగా ముందుకెళుతుంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపి అనూహ్యంగా లీడ్ లోకి వస్తుంది.
మొదట టిడిపి గెలుపు అవకాశం ఉన్న సీటు నర్సీపట్నం…ఇక్కడ అయ్యన్నపాత్రుడు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. అటు పెందుర్తి సీటులో బండారు సత్యనారాయణమూర్తికి సైతం గెలుపు అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. అలాగే చోడవరంలో కేఎస్ఎన్ రాజు పికప్ అయ్యారు. ఇటు అనకాపల్లిలో టిడిపికి అనుకూల వాతావరణం ఉంది..కాకపోతే ఇక్కడ జనసేనకు కొన్ని ఓట్లు ఉన్నాయి.
టిడిపి-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీకి ఓటమే. అలాగే ఎలమంచిలి, పాయకరావుపేట సీట్లలో కూడా అదే పరిస్తితి. టిడిపి-జనసేన పొత్తుతో వైసీపీకి చెక్ పడుతుంది. ఒక్క మాడుగులలో కాస్త వైసీపీకి లీడ్ ఉంది. మొత్తానికి ఈ సారి అనకాపల్లిలో టిడిపికి లీడ్ వచ్చే ఛాన్స్ ఉంది.