టిడిపి అధినేత చంద్రబాబు ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. కొంతకాలంగా నియోజకవర్గాల రివ్యూ మీటింగులు జరిపి..ఇంచార్జ్లకు దిశానిర్దేశం చేసిన బాబు..ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాబు..రాష్ట్రంలోని సమస్యలపై గళం విప్పుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రజలపై పన్నుల భారం, దాడులు, కేసులు, వైసీపీ దోపిడిపై గళం విప్పిన బాబు.ఇప్పుడు జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించనున్నారు.
ఇప్పటికే వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి..టిడిపి హయాంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారు..వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలతో సహ చెప్పారు. ఇప్పుడు డైరక్ట్ ప్రాజెక్టుల వద్దకు వెళ్ళి..వాటి పరిస్తితిని అక్కడే బహిరంగ సభ పెట్టి ప్రజలకు వివరిస్తారు. ఇందులో భాగంగా మొదట నందికొట్కూరు వెళ్ళి అక్కడ సభ నిర్వహించి..ముచ్చుమర్రి, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ పథకాలను చంద్రబాబు సందర్శిస్తారు. రాత్రికి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బస చేస్తారు.
ఆగష్టు 2వ తేదీ జగన్ కంచుకోట పులివెందులలో భారీ సభ నిర్వహించనున్నారు. పులివెందుల టౌన్ పూల అంగళ్ల సెంటర్లో సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడ సభని భారీ సక్సెస్ చేసి..జగన్కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. తర్వాత వరుసగా అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పర్యటిస్తారు..ఇలా వరుసగా పది రోజుల పాటు శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాజెక్టులని బాబు సందర్శించి..బహిరంగ సభలు పెట్టి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని బయటపెట్టనున్నారు.
అయితే బాబుని ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేలా వైసీపీ కుట్రలు చేస్తుంది. కానీ ఎంత అడ్డుకుంటే అంత ఎక్కువగా వైసీపీకే నష్టం జరగనుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు టూర్ వైసీపీకి గట్టిగానే దెబ్బవేస్తుంది.