లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శి నియోజకవర్గంలో ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. వాస్తవానికి అన్నీ స్థానాలకు ఇంచార్జ్లు ఉన్నారు..కానీ దర్శికి ఇంచార్జ్ లేరు. దీంతో ఇక్కడ పాదయాత్ర పెద్దగా సక్సెస్ కాదని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా జనం వచ్చారు. భారీ బహిరంగ సభ జరిగింది. సభ సక్సెస్ అయింది.
అయితే సభ సక్సెస్ కావడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో చిన్న టెన్షన్ కూడా ఉంది. ఈ సీటులో టిడిపి పోటీ చేస్తుందా? లేదా? అనే డౌట్ ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అందుకే ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేశ్ కూడా తప్పుకున్నట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ గతంలో టిడిపికి పనిచేసిన శిద్ధా రాఘవరావు, కదిరి బాబూరావు వైసీపీలోకి జంప్ చేశారు.
దీంతో కొంతకాలానికి పమిడి రమేశ్ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే దర్శి మున్సిపాలిటీని టిడిపి గెలుచుకుంది. కానీ ఆయనకు సీటు ఫిక్స్ కాకపోవడంతో ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా ఉంటున్నారు. ఇంతవరకు ఇంచార్జ్ని పెట్టలేదు. దీంతో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారనే టాక్ వస్తుంది. అయితే ఇప్పుడు దర్శిలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయింది. ఆయన వెనుక దర్శి నేతలు మాజీ ఎమ్మెల్యే పాపారావు, వెంకట్రావు నడిచారు.
అయితే ఇంచార్జ్ లేకపోయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టిడిపి శ్రేణుల్లో ఆనందం నెలకొంది. అదే సమయంలో దర్శిని అభివృద్ధి చేసే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పారు తప్ప..లోకేష్..ఇంచార్జ్ ఎవరో చెప్పలేదు. దీంతో ఈ సీటు దాదాపు జనసేనకే దక్కుతుందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. చూడాలి మరి దర్శి సీటు ఎవరికి దక్కుతుందో.