రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తారు..ఏదైనా ఒక పని చేస్తే దాని వెనుక రాజకీయ కోణం ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రాజకీయంగా ఉపయోగపడాలనే చేస్తారు. అందుకే తెలంగాణ సిఎం కేసిఆర్ కూడా గతంలో కొన్ని విషయాల్లో విమర్శలు ఎదురైనప్పుడు…తాము పెట్టుకున్నది రాజకీయ పార్టీ అని స్వచ్ఛంద సంస్థ కాదని..ఏదైనా రాజకీయ లబ్ది కోసమే చేస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు.
అంటే రాజకీయ పార్టీ అంతే..ఇంకా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఏదైనా ఒక పనిచేస్తే దాని వెనుక బోలెడు రాజకీయ కారణాలు ఉంటాయి. ఒక పథకం అమలు చేస్తున్నారంటే ఎన్ని ఓట్లు పడతాయనేది లెక్క. కొన్ని నిర్ణయాల వల్ల ప్రత్యర్ధులకు రాజకీయంగా ఎలా చెక్ పెట్టాలనేది చూస్తారు. ప్రతిదీ రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. కానీ రాజకీయ కోణం లేకుండా కేవలం ప్రజల కోసం ఆలోచించేవారు తక్కువగానే ఉంటారు. అలాంటి అరుదైన ఆలోచనలు టిడిపి అధినేత చంద్రబాబు చేస్తూ ఉంటారు. టిడిపి అనేది రాజకీయ పార్టీ కాబట్టి ఆయన చేసే ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంటుంది. అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రాజకీయంగా తమ పార్టీ సక్సెస్ అవ్వాలని ఏ నాయకుడైన కోరుకుంటారు.
అదే సమయంలో ప్రజల మేలు కోసం ముందుచూపుతో ఆలోచించే నిర్ణయాలు కూడా బాబు తీసుకుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి విజన్ 2020 అనే నినాదం 1995 తర్వాత ఆయన సిఎం అయ్యాక..ఇచ్చిన నినాదం..2020కి ఏపీ నెంబర్1 గా అవ్వాలనేది బాబు టార్గెట్. భవిష్యత్లో ఏం జరుగుతుందనేది ముందే ఊహించి..దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి పాలన చేస్తారు. అయితే 2004లో విజన్ 2020కి బ్రేక్ పడింది.
మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చారు..అప్పుడు విజన్ 2029 పెట్టుకున్నారు..కానీ ప్రజలు ఆయన్ని అర్ధం చేసుకోలేదు. 2019 ఎన్నికల్లో బ్రేకులు వేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సరే ఆయన దేశంతో పాటు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్లాలని విజన్-2047 డాక్యుమెంట్ రూపోదించారు.
దీని ద్వారా 2047కి భారతదేశం..ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదగాలని, ఇటు ఏపీ నెంబర్1 రాష్ట్రంగా ఎదగాలని భావించి విజన్ రూపొందించారు. అందులో ప్రపంచానికి కావలసిన ఉద్యోగాల కోసం భారత్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపోదించడం, అంతర్జాతీయ స్థాయికి మన కంపెనీలు చేరడం, కుటుంబం ప్రామాణికంగా వనరులు, అవకాశాలు పెంచడం, హరిత ఇంధనంతో ఇంధన భద్రత, దేశం బాగుండాలి.. తెలుగువారు అగ్ర జాతిగా ఉండాలనేది బాబు విజన్.
నిజంగా ఇదొక అద్భుతమైన విజన్..ఇలా ఏ నాయకుడు కూడా రాజకీయంగా కాకుండా దేశం ఆలోచించడం తక్కువ..మరి బాబు విజన్ని ప్రజలు అర్ధం చేసుకుని మళ్ళీ అవకాశం ఇస్తారేమో చూడాలి.