ఎప్పటికప్పుడు లోకేష్ పాదయాత్ర పీక్స్కు వెళుతూనే ఉంది. చిత్తూరులో ఒక స్థాయి..అనంతపురంలో మరో స్థాయి..అలా కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఇలా ఒక జిల్లా మించి ఒక జిల్లా…ఒక నియోజకవర్గం మించి..ఒక నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు భారీగా ప్రజల మద్ధతు వస్తుంది. ఇప్పుడు ఆయన పాదయాత్ర..గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన మంగళగిరిలో జరుగుతుంది.
అక్కడ ఊహించని విధంగా ప్రజా మద్ధతు దక్కింది. ఓడిన నాయకుడు కోసం జనాలు ఎగబడ్డారు. పప్పు అని పిలిచి ఎగతాళి చేసిన నేతని చూడటం కోసం జనాలు గ్రామ గ్రామాల నుంచి తరలివచ్చారు. సంబరాలని మించిన జనం మంగళగిరిలో కనిపించారు. అక్కడమైన తిరునాళ్ళు జరుగుతున్నాయా? అనే విధంగా వచ్చారు. జాతీయ జెండా చేపట్టి లోకేశ్ ఫ్రీడమ్ వాక్ చేస్తుంటే…అశేష జనవాహిని ఆయనతో కదిలింది. చేనేత, దళిత, మైనారిటీ వర్గాలు ఆయనతో పాదం కలిపాయి. ఎక్కడకక్కడ కొత్త కొత్త భారీ గజమాలలతో లోకేష్ని ఆహ్వానం పలికారు. ఇక ఊహించని విధంగా భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు సైతం లోకేష్కు మద్ధతు తెలిపి టిడిపిలో చేరారు. ఈ పరిస్తితులని చూస్తుంటే గత ఎన్నికల్లో లోకేష్ని ఓడించిన మంగళగిరి నియోజకవర్గామా? అనే డౌట్ వస్తుంది. ఏ నాయకుడైన తమ కులం,తమ బలం చూసుకుని నియోజకవర్గాలు ఎంచుకుని పోటీ చేస్తారు. ఉదాహరణకు పులివెందులలో 70 శాతం రెడ్డి వర్గమే..అందుకే అక్కడ జగన్కు తిరుగుండదు.