రాజకీయాల్లో కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటే ఆటోమేటిక్ గా విజయాలు వస్తాయి. కానీ కొంతమందికి బై లక్ విజయాలు వస్తాయి. అలా లక్కీగా గెలిచే ఎమ్మెల్యేలు ఏపీలో చాలామందే ఉన్నారు. గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ వేవ్ లో గెలిచేశారు. అలాగే జనసేన ఓట్లు చీల్చడం వల్ల కూడా గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యేల్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా ఒకరు.
ఈయన గత ఎన్నికల్లోనే కాదు..2004 నుంచి అదృష్టం కొద్ది ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 1999 వరకు ఇక్కడ టిడిపి హవా నడిచింది. టిడిపి నుంచి బండారు సత్యానందరావు గెలుస్తూ వచ్చారు. 2004లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో బండారుపై..కాంగ్రెస్ నుంచి చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి బండారు పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో జగ్గిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం 713 ఓట్ల తేడాతో టిడిపిపై గెలిచారు. అంటే ఇది ఎంత లక్కీ విక్టరీ అనేది అర్ధం చేసుకోవచ్చు.
అయితే 2019 ఎన్నికల్లో జగన్ హవా ఉంది..అయినా సరే జగ్గిరెడ్డి గెలిచింది కేవలం 4 వేల ఓట్లతోనే. ఇలా వరుసగా లక్కీగా గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి ఆ అదృష్టం ఉండేలా లేదు. అక్కడ టిడిపి బలపడుతుంది. అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి..జగ్గిరెడ్డి అక్రమాలు బయటపెట్టారు. బాబు టూర్కు కొత్తపేట ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
దీంతో కొత్తపేటలో జగ్గిరెడ్డి విజయాలకు బ్రేక్ పడిపోయిందని చెప్పవచ్చు. ఈ సారి జనసేన విడిగా పోటీ చేసిన సరే ఇక్కడ టిడిపి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు ఉంటే టిడిపి భారీ మెజారిటీతో కొత్తపేటని కైవసం చేసుకుంటుంది.