ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం…వైసీపీ కంచుకోట..ఇంకా చెప్పాలంటే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అడ్డా అని చెప్పవచ్చు. ఎందుకంటే 1985 నుంచి ఇక్కడ కాటసాని హవా నడుస్తోంది. 1983లో ఎన్టీఆర్ వేవ్ లో ఇక్కడ టిడిపి గెలిస్తే..1985లో టిడిపి వేవ్ ఉన్నా సరే కాంగ్రెస్ నుంచి కాటసాని గెలిచారు. తర్వాత 1989, 1994లో గెలిచారు. ఇక 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది.
2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాటసాని గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గౌరు చరితరెడ్డి పోటీ చేస్తే, ఇండిపెండెంట్ గా కాటసాని పోటీ చేశారు. టిడిపి నుంచి ఎరాసు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. ఇక కాటసానిపై చరిత 11 వేల ఓట్లతో గెలిచారు. అప్పుడు కాటసానికి 60 వేల ఓట్లు రాగా, టిడిపికి 53 వేల ఓట్లు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల ముందు కాటసాని వైసీపీలో చేరారు. దీంతో పాణ్యం సీటు ఆయనకే ఫిక్స్ అయింది. దీంతో చరిత టిడిపిలోకి వచ్చారు.
2019లో కాటసాని దాదాపు 43 వేల ఓట్ల మెజారిటీతో చరితపై గెలిచారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. అయితే ఈ సారి చరిత..పాణ్యంలో టిడిపి ఓటముల చరిత్రని మార్చి విజయం దిశగా తీసుకెళ్తారా? లేదా? అనేది చూడాలి. అయితే ప్రస్తుతం కాటసాని ఇమేజ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇటు టిడిపి లో చరిత కూడా కష్టపడుతున్నారు. మళ్ళీ తన బలాన్ని పెంచుకునే గెలవాలని చూస్తున్నారు.
అయితే ఇక్కడ రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువ దీంతో..వైసీపీకి ప్లస్ ఉంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెడ్డి వర్గానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. అటు చరిత కూడా రెడ్డి వర్గమే. బిసిలు టిడిపి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఎస్సీలు వైసీపీకి ఫేవర్ గా ఉన్నారు. ఏదైనా పాణ్యంలో ప్రస్తుతం వైసీపీకే లీడ్ కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్తితి మార్చి పాణ్యంలో చరిత టిడిపి జెండా ఎగరవేస్తారేమో చూడాలి.