వయసు అయిపోయింది..ముసలోడు..ఇంకా టిడిపిని గెలిపించలేరు..అంటే ప్రత్యర్ధి వైసీపీ నేతలు నిత్యం విమర్శలు చేయడమే. ఇంకా వయసు ఎవరికైనా పెరుగుతుందనే అంశాన్ని మర్చిపోయి నిసిగ్గుగా బాబుని టార్గెట్ చేసి ఎగతాళి చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ఆఖరికి సిఎం జగన్ సైతం..బాబుని ఉద్దేశించి ముసలోడు అని సంబోధించి మానసిక ఆనందం పొందుతున్నారు.
అయితే జగన్ వయసు 50 ఏళ్ళు..బాబు వయసు 75కి దగ్గరగా ఉన్నాయి. మరో ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు..ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు. ఇదంతా ప్రజలకు తెలిసిపోతుంది. ఇంటి పక్కనే ఉండే సభకు సైతం హెలికాప్టర్ లో వెళ్ళే జగన్కు, ప్రతిపక్షంలో ఉంటూ కూడా అర్ధరాత్రి 12 గంటల దాటాక కూడా పార్టీ కోసం పనిచేసే బాబుకు చాలా తేడా ఉందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు బాబు రోడ్ షోలు ఒక ఎత్తు అయితే..సాగునీటి ప్రాజెక్టుల వైసీపీ విధ్వంసంపై యుద్ధభేటీ అంటూ పది రోజుల పాటు ఏకధాటిగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటించి సరికొత్త ట్రెండ్ సృష్టించారు.
ఆగష్టు 1న నందికొట్కూరులో మొదలుపెట్టి..ఆగష్టు 10 పాతపట్నం వరకు బాబుకు అలుపు రాలేదు..ఇంకా దూకుడుగా ముందుకెళ్లారు. ఇస్రో చంద్రయాన్ జాబిల్లిపైకి ఎంత వేగంగా దూసుకుపోతుందో అంతే వేగంగా ఈ చంద్రబాబు దూసుకెళుతున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. 10 రోజులు..15 ప్రాజెక్టులు..20 జిల్లాలు..30 నియోజకవర్గాలు..3 వేల కిలోమీటర్లు..35 ప్రెజెంటేషన్లు, బహిరంగ సభలు, బెదిరింపులకు భయపడలేదు..రాళ్ళదాడులని లెక్క చేయలేదు..జనం కోసం…మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి..రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా బాబు నాన్స్టాప్ మాదిరిగా ప్రజల్లో తిరిగారు. అందుకే బాబు రావాలి..రాష్ట్రం గెలవాలి అని తముళ్ళు నినదిస్తున్నారు.