రాష్ట్రంలో రాజకీయంగా కమ్మ, కాపు, రెడ్డి వర్గాల మధ్య పోరు ఎలా జరుగుతుందో..అదే స్థాయిలో వార్ జరిగే నియోజకవర్గం ఒంగోలు..ఇక్కడ కమ్మ, రెడ్డి, కాపు వర్గాలే కీలకం..ఈ మూడు వర్గాలు గెలుపోటములని ప్రభావితం చేస్తాయి. అయితే ఓ సారి రెడ్డి వర్గం నేత నడిస్తే..మరోసారి కమ్మ వర్గం నేత హవా నడుస్తోంది. కానీ 1999 ఎన్నికల నుంచి ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి హవా నడుస్తోంది.
1999, 2004, 2009, 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆయన గెలుపుకు ప్రధాన కారణం కమ్మ వర్గం కూడా ఉంది. రెడ్డి, కాపు వర్గాలతో పాటు కొంత కమ్మ వర్గం ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల గెలుస్తూ వచ్చారు. కానీ 2014లో మద్ధతు దక్కలేదు. దీంతో టిడిపి నుంచి దామచర్ల జనార్ధన్ గెలిచారు. టిడిపి అధికారంలో ఉండగా దామచర్ల అభివృద్ధి బాగానే చేశారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఆయన ఓటమి పాలయ్యారు.
ఆ ఎన్నికల్లో రెడ్డి, కాపు, కమ్మ వర్గాలతో పాటు బిసి, దళిత, ముస్లిం మెజారిటీ ఓట్లు బాలినేనికి పడ్డాయి. దీంతో బాలినేని గెలిచారు. కానీ అధికారంలోకి వచ్చి మంత్రి అయిన సరే ఒంగోలులో అభివృద్ధి తక్కువే. రెడ్డి వర్గానికి తప్ప..మిగతా వర్గాలకు ఒరిగింది ఏమి లేదు. పైగా వైసీపీ కమ్మ వర్గాన్ని ఎలా టార్గెట్ చేస్తుందో తెలిసిందే. దీంతో దాదాపు కమ్మ వర్గం బాలినేనికి యాంటీ అయింది..దామచర్ల వైపు ఉన్నారు. అటు కాపు వర్గంలో కూడా యాంటీ ఉంది. ఇక బిసి, దళిత, మైనారిటీ వర్గాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఉన్నారు.
ఇటు సొంత వర్గం రెడ్లు కూడా బాలినేనికి పూర్తిగా మద్ధతు ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక టిడిపి-జనసేన పొత్తు ఉంటే..దామచర్లకు కాపు ఓట్లు కలిసొస్తాయి. అప్పుడు బాలినేనిపై పై చేయి సాధించే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఈ సారి ఒంగోలులో బాలినేని గెలుపు సులువు కాదు.