తెలంగాణ సరిహద్దులో ఉన్న నియోజకవర్గం తిరువూరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఇది ఎస్సీ రిజర్వుడు స్థానం. ఇక్కడ విసన్నపేట,గంపలగూడెం తిరువూరు మండలాలతో నియోజకవర్గం ఉంటుంది.దీనిలో పూర్వం కాంగ్రెస్ గెలిచినా తర్వాత టిడిపి గెలిచింది.ఇప్పుడు మాత్రం వైసిపినే అధికారంలో ఉంది.
వైసిపి ఎమ్మెల్యేగా కొక్కిలిగడ్డ రక్షణ నిధి రెండుసార్లు గెలిచారు.ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి ఉంది.వైసీపీ పార్టీ పై ఉన్న అసంతృప్తి ఉంది. ఈ రెండు కలిసి చూస్తే ఈసారి తిరువూరులో వైసీపీకి విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. నియోజకవర్గం లో అభివృద్ధి లేదంటూ టిడిపి వైసిపి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరువూరు టిడిపిలో సరైన నాయకత్వమే లేదు. అసలు తిరువూరు టిడిపిలోనాయకులే లేరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎస్సీ ఓటర్లను నమ్ముకుంది. కానీ ఈ సారి ఎస్సీ ఓటర్లు వైసీపీ ఎమ్మెల్యేకు యాంటీగా ఉన్నారు. అంతేకాక నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.అందువల్ల టిడిపిని గెలిపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవడానికి టిడిపిలో సరైన నాయకుడే లేరు. ఉన్న వారిలో నల్లగట్ల స్వామి దాస్, దేవదత్ వీరిరువురు టికెట్ ని ఆశిస్తూ ఉండగా,అధిష్టానం కొత్తవారిని అంటే పామర్రు ఇంచార్జ్ వర్ల కుమార్ రాజాను గాని, ఉండవల్లి శ్రీదేవిని గాని పోటీ చేయించాలి అని ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నారు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం వైసిపి టిడిపి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ
కానీ తిరువూరు పై టిడిపి ప్రత్యేక శ్రద్ధ పెట్టి..నాయకులు కలిసి పనిచేస్తే..తిరువూరులో ఎగిరేది పసుపు జెండానే.!
ReplyReply allForward |