లోకేష్ పాదయాత్ర ఎప్పటికప్పుడు అంచలనాలని తారుమారు చేస్తూనే ఉంది. ఒక జిల్లాని మించి మరొక జిల్లాలో పాదయాత్రకు ప్రజా మద్ధతు ఊహించని స్థాయిలో వస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు టార్గెట్లు మారిపోతున్నాయి..దీనికి మించి చేయాలని తర్వాత జిల్లా టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఇక లోకేష్ ఓడిన మంగళగిరిలో ప్రజా మద్ధతు కనీవినీ ఎరుగని రీతిలో వచ్చింది. అలా మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ పైకి పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఇంకా అంతే..కృష్ణా నది కాస్త..బ్యారేజ్ పై ప్రవహిస్తుందా? అనే రీతిలో లోకేష్ వెనుక తెలుగు తమ్ముళ్లతో పాటు సామాన్య ప్రజానీకం కదిలారు. ఇక విజయవాడ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో గుంటూరు టిడిపి నేతలు..లోకేష్కు వీడ్కోలు పలకగా, ఉమ్మడి కృష్ణా జిల్లా తమ్ముళ్ళు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వరకు ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకు జనాదరణ కనిపించింది. అడుగడుగున జనం నిలబడ్డారు..లోకేష్ కు కరచాలనం, ఫోటోలతో దిగేందుకు ఎగబడ్డారు. ఒకానొక దశలో లోకేశ్ సైతం షాక్ అయ్యేలా ప్రజలు వచ్చారు.
అయినా ఎక్కడ విశ్రమించకుండా ప్రజలని కలుసు ముందుకెళ్లారు. ఇలా బెజవాడలో మొదలైన పాదయాత్ర ఊహించని స్థాయిలో మొదటిరోజు కొనసాగింది. ఉమ్మడి జిల్లా తమ్ముళ్ళు లోకేష్ తో కలిసి పాదయాత్ర చేశారు. ఇక లోకేష్ పాదయాత్ర బెజవాడలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు..అదొక ఫ్లాప్ యాత్ర అని విమర్శలు చేశారు. లోకేష్కు అసలు విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదని మాట్లాడారు.
కానీ లోకేష్కు బెజవాడలో ప్రజా మద్ధతు చూశాక..వైసీపీ నేతలకు సౌండ్ లేదనే చెప్పాలి. ఇక రెండు రోజులు పాదయాత్ర ఉంది..లోకేష్ దెబ్బకు వైసీపీ అస్సామే.
ReplyReply allForward |