గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి. వాస్తవానికి ఇక్కడ టిడిపి ఒక్క సీటు కూడా గెలవదని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ టిడిపికి కంచుకోట స్థానాలు ఉన్నాయి. విజయనగరం, శృంగవరపుకోట లాంటివి కంచుకోటలు. కానీ వాటిల్లో కూడా టిడిపి ఓడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 9కి 9 సీట్లలో వైసీపీ గెలిచింది.
ఇక కొత్తగా జిల్లాల విభజన జరగగా, కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. రాజాం, బొబ్బిలి, విజయనగరం,గజపతినగరం, నెల్లిమర్ల,చీపురుపల్లి, ఎస్.కోట. ఈ ఏడు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఇప్పుడు నిదానంగా సీన్ మారిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఊహించని విధంగా టిడిపి వన్ సైడ్ గా లీడ్ లో ఉంది. ఇటీవల సర్వేలు చూసుకుంటే ఒక్క చీపురుపల్లిలోనే వైసీపీ గెలుస్తుందని తేలింది. అక్కడ బొత్స సత్యనారాయణ ఉండటం వల్లే గెలుపు.
ఇక టిడిపి మూడు స్థానాల్లో డౌట్ లేకుండా గెలుస్తుందని తేలింది. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట ఇంకా మూడు చోట్ల టిడిపి విజయం ఖాయం. రాజాం, నెల్లిమర్లలో టఫ్ ఫైట్ ఉంది..కానీ స్వల్ప లీడ్ టిడిపికే ఉంది. అంటే ఒక్క సీటు మినహా మిగిలిన సీట్లు టిడిపి ఖాతాలో పడేలా ఉన్నాయి. మొత్తం మీద ఈ సారి విజయనగరంలో వైసీపీకి చావు దెబ్బ తగిలేలా ఉంది.