జగన్ చేసే ప్రతి వెనుక రాజకీయంగా ఏదొక కుట్ర ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక రాజకీయ కోణం ఏదో ఉంటుంది..అందులో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు. ఉదాహరణకు మూడు రాజధానులు అన్నారు..మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని అన్నారు. కానీ దాని వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటంటే అమరావతిని దెబ్బతీయడం తద్వారా టిడిపికి డ్యామేజ్..అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది..అలాగే రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ భూ కబ్జాలకు అంతు లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇలా ఒక నిర్ణయం అనేక కోణాలు ఉంటాయి. ఇప్పుడు అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు అంటున్నారు. కానీ రాజధాని కోసమని తాము భూములు ఇస్తే..రాజధాని ప్రాంతం వాళ్ళకు కాకుండా వేరే చోట నుంచి వచ్చిన వారికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అక్కడి రైతులు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై పోరాడుతున్నారు. కానీ కోర్టు ఇళ్ల పట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇళ్ల నిర్మాణం కోర్టు షరతులకు లోబడి చేయాలని తీర్పు ఇచ్చింది.
అయితే జగన్, వైసీపీ నేతలు ఇప్పటికే రాజధానిలో పేదలకు భూములు ఇస్తే టిడిపి అడ్డుకుంటుందని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 50 వేల మందికి సెంటు భూమి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉండగానే శంఖుస్థాపన చేసేస్తున్నారు. ఇక ఇలా అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం ఏంటంటే..ఇప్పటికే ఆ పరిధిలో వైసీపీకి వ్యతిరేకత ఉంది.
అందుకే విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలోని వైసీపీ సానుభూతి పరులకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. వారిని అక్కడ ఓటర్లుగా చేర్చి తాడికొండ, మంగళగిరి ల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. పైగా ఇళ్ల పట్టాలు పేదలకు కాకుండా..ఇళ్ళు, వ్యాపారాలు ఉన్న వైసీపీ వాళ్ళకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అర్ధమవుతున్నాయి. ఇది పూర్తిగా వైసీపీకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.