లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా జన సందోహం లోకేష్కు మద్ధతు తెలుపుతుంది. అయితే పాదయాత్ర విజయవాడ నగరంలో ఒక ఎత్తు..పెనమలూరులో మరో ఎత్తు అన్నట్లు సాగింది. ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటల వరకు పాదయాత్ర కొనసాగింది. దీని బట్టి చూస్తే పెనమలూరు ప్రజలు లోకేష్ కోసం ఎలా ఎదురుచూశారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే అక్కడ టిడిపికి ఉన్న ఆదరణ ఏంటి అనేది తేలిపోయింది.
లోకేష్ పాదయాత్రతో పెనమలూరులో ఈ సారి విజయం వన్సైడ్ కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. పెనమలూరు టిడిపికి కంచుకోట..కానీ రెండు సార్లు బై లక్ పార్థసారథి విజయం సాధిస్తూ వచ్చారు. 2008లో కొత్తగా ఏర్పడిన ఈ స్థాననానికి 2009 లో జరిగిన ఎన్నికల్లో సారథి కాంగ్రెస్ నుంచి, టిడిపి నుంచి చలసాని పండు పోటీ చేశారు. అప్పుడు కేవలం 200 ఓట్ల తేడాతోనే సారథి గెలిచారు. పైగా ప్రజారాజ్యం ఓట్లు చీల్చింది.
2014లో టిడిపి హవా స్పష్టంగా కనిపించింది..దాదాపు 30 వేలు పైనే ఓట్ల మెజారిటీతో టిడిపి నుంచి బోడే ప్రసాద్ గెలిచారు. నెక్స్ట్ టిడిపి అధికారంలోకి వచ్చాక పెనమలూరు అభివృద్ధి బాటపట్టింది. విజయవాడ నగరంలో కలిసిపోతూ..సిటీలా అభివృద్ధి అయింది.కానీ 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నుంచి పోటీ చేసిన సారథి వైపు చూశారు. జనసేన పొత్తులో బిఎస్పి పోటీ చేసి ఓట్లు చీల్చింది. కానీ వైసీపీని గెలిపిస్తే అభివృధ్ది వెనక్కి వెళ్లింది..అక్రమాలు పెరిగాయి.
దీంతో ప్రజలు మళ్ళీ బోడే వైపు చూస్తున్నారు. ఇదే తరుణంలో లోకేష్ పాదయాత్రతో పెనమలూరు ప్రజలు ఎటు వైపు ఉన్నారో తేల్చేశారు. ఈ సారి ఇక్కడ బోడే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అంటున్నారు.