అర్ధరాత్రి దాటేసింది..రాత్రి 1 అయింది..జనహోరు తగ్గలేదు..2అయినా అదే ఊపు..ఇంకా తెల్లవారు జాము 3 అయింది..అయినా అదే జనం.. అంటే ఒక నాయకుడు కోసం రాత్రి 3 అయిన రోడ్లపై జనం ఉన్నారు..అసలు ఇదేంటి అని ఆశ్చర్యపోయేలా ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరులో లోకేష్ పాదయాత్ర సంచలనం సృష్టించింది. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, తర్వాత జగన్ పాదయాత్ర చేశారు…కానీ ఇలాంటి సీన్ ఎక్కడ చూడలేదు.
మామూలుగా షెడ్యూల్ ప్రకారం విజయవాడ ఈస్ట్, పెనమలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని గన్నవరంలో పరిధిలోని నిడమనూరులోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వాలి. షెడ్యూల్ ప్రకారం లోకేష్ ఎంటర్ అయ్యారు..కానీ అప్పుడు సమయం రాత్రి 3 గంటలు..అప్పటివరకు లోకేష్ ఓపికతో ప్రజలని చిరునవ్వుతో పలకరిస్తూనే ముందుకెళ్లారు. భుజానికి గాయమైన…చేతులకు గోళ్ళు తాకి గాయాలైన లోకేష్ అదే ఊపుతో పాదయాత్ర చేశారు. కావాలంటే పాదయాత్ర 10 లోపే ముగించి..తర్వాత రోజు కంటిన్యూ చేయవచ్చు. కానీ అప్పటికే జానా సందోహం ఉంది. వారిని నిరాశపర్చాకుండా లోకేష్ ముందుకెళ్లారు. అయితే అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ కంటే ఆలస్యంగా మొదలైంది. 20వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 21 వ తేదీ తెల్లవారుజామున 3:40గంటల వరకూ పాదయాత్ర కొనసాగింది.
అంటే నాన్ స్టాప్గా 12 గంటలపైనే పాదయాత్ర కొనసాగింది. అంటే జానా సందోహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా ప్రజలు లోకేష్ కోసం ఎలా ఎదురుచూస్తున్నారో చూడవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ఉపయోగం లేదు..అందుకే ప్రజలు మళ్ళీ టిడిపి వైపు చూస్తున్నారనే దానికి పెనమలూరులో లోకేష్ పాదయాత్ర పెద్ద ఉదాహరణ.
ఒకవేళ జనం లేరనుకుంటే..12 గంటల్లోపే పాదయాత్ర ఆపేసేవారు..కానీ కంటిన్యూగా జనం ఉండటం వల్ల..3 గంటల వరకు సాగింది. మొత్తానికి టిడిపిని గెలిపించాలనే కసితో కృష్ణా ప్రజలు ఉన్నారు.