ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథం వైపు నడిపించిన ముఖ్యమంత్రి ఎవరంటే కచ్చితంగా ఎవరైనా చెప్పాల్సిన పేరు చెప్పే పేరు చంద్రబాబు నాయుడు. తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి రాజధాని అభివృద్ధి కోసం తన ప్రత్యేక కృషిని చేశారు.
కుప్పం నుండి చంద్రబాబు నాయుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి , మూడు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. 2024 లో ఎవరు సాధించలేనంత లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు, టిడిపి పార్టీ తన వ్యూహాన్ని రచిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక విధంగా టిడిపి నాయకులను కార్యకర్తలను వేధించే పనిలో ఉంది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి పంచాయతీ ఎలక్షన్లో వైసిపి అధికార బలంతోనే గెలిచింది కానీ ప్రజల మద్దతుతో కాదు. ప్రజలను భయపెట్టి, బెదిరించి ఓట్లు వేయించుకొని గెలిచారు. ప్రజల మద్దతుతో గెలవకపోయినా వైసీపీ మాత్రం టిడిపిని ఓడించామని ,రాష్ట్రంలో టిడిపి లేదని ప్రచారం చేస్తుంది.
మొన్న జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంది. కుప్పంలో మాత్రం వైసిపి అక్కడి నేతలను బెదిరించి వార్డులను ఏకగ్రీవాలుగా చేశారు. ఆ గెలుపును చూసి వైసిపి వారు తామే గెలిచామని కుప్పంలో కూడా టిడిపి నేతకు ఓటమి తప్పదని ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు” వాపును చూసి బలం” అనుకొని భ్రమ పడుతున్నారు.
2014 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అభ్యర్థులు విజయం సాధించి, చంద్రబాబు నాయుడు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించి అధికారం చేపడితే గాని, వైసీపీ నాయకులకు ఇంతకుముందు గెలిచిన ఎన్నికలలో గెలుపు “బలం కాదు వాపు అని “అప్పుడు గాని అర్థం కాదు.