మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు…ఇది పాత డైలాగ్ అయినా ఇదే నిజం. వారి తలుచుకుంటే ఏదైనా చేస్తారు..ఇక రాజకీయాల్లో వారి పాత్ర చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలని మార్చేయగల శక్తి వారికి ఉంది. ప్రభుత్వాలని మార్చగలరు. సమాజంలో సగం పైనే ఉన్న మహిళల ఓట్లు ఇప్పుడు చాలా కీలకమైనవి. అందుకే ప్రతి పార్టీ మహిళల ఓట్లని దక్కించుకోవడానికి వివిధ రూపాల్లో హామీలు ఇస్తారు.
అయితే గత ఎన్నికల్లో ఏపీలో మెజారిటీ మహిళలు వైసీపీ వైపే మొగ్గు చూపారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీలని మహిళలు గట్టిగానే నమ్మారు..అలాగే చంద్రబాబు అప్పుడు అనుకున్న హామీలని సరిగా అమలు చేయలేదు. దీని వల్ల మహిళలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి ఓటు వేశారు. దీంతో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఏమైనా ఒరుగుతుందా? అంటే కోతలు విధించిన పథకాలు కొన్ని వస్తున్నాయి. కానీ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చిన..పన్నుల రూపంలో వైసీపీ బాదుడు గురించి మహిళలకు బాగా అర్ధమైంది. ఎందుకంటే ఇల్లుని మెయిన్టైన్ చేసేది వాళ్లే. అందుకే జగన్ బాదుడు అర్ధమైంది..ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వారు యాంటీగా మారుతున్నారు.
ఇదే క్రమంలో టిడిపి మహాశక్తి పేరుతో మహిళలకు కీలక హామీలు ఇచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం…ఇక అందరికీ వచ్చినట్లే పెన్షన్ ఇవి కామన్. అయితే ఇలా మహాశక్తి పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో మహిళాలని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో టిడిపికి అనూహ్యంగా మద్ధతు పెరుగుతుంది. ఈ మహాశక్తితో టిడిపికి ప్లస్..వైసీపీకి రివర్స్ అవ్వడం ఖాయమే.