ఏపీలో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆ పార్టీలోనే నేతలు సైతం టిడిపి వైపు చూడటం మొదలుపెట్టారు. వైసీపీలో సరిగ్గా పనులు చేయలేకపోవడం, వర్గ పోరు వల్ల నేతలు ఒక్కొక్కరిగా బయటకొచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు తనయుడు బూడి రవి చంద్రబాబుని కలవడం సంచలనంగా మారింది.
అధికారంలో ఉన్నారు పైగా..డిప్యూటీ సిఎం అయినా సరే ఆయన తనయుడు టిడిపి వైపుకు రావడానికి రెడీ అవుతున్నారు. అయితే చంద్రబాబుని బూడి రవి కొన్ని రోజుల క్రితం కలిశారు. బాబు విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి ఇంట్లో రవి..బాబుని కలిశారు. అయితే దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో వైసీపీకి మరో షాక్ తగలడం ఖాయమనే ప్రచారం వస్తుంది.
అయితే రవి..బూడి మొదట భార్య కుమారుడు..దీంతో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసింది. స్థానిక ఎన్నికల్లో రవి జెడ్పీటీసీగా నామినేషన్ వేస్తే అతన్ని తప్పించి..బూడి తన రెండు భార్య కుమార్తె అనురాధని జెడ్పీగా నిలబెట్టి గెలిపించుకున్నారు. అక్కడ నుంచి అనురాధకు ప్రాధాన్యత పెరగడంతో రవి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన..చంద్రబాబుని కలిసినట్లు తెలుస్తుంది.
అయితే రవి ఇంకా టిడిపిలోకి వచ్చే విషయంలో క్లారిటీ రాలేదు. టిడిపిలోకి వచ్చిన సీటు డౌటే..ఆల్రెడీ మాడుగులలో టిడిపి ఇంచార్జ్ గా పివిజి కుమార్ ఉన్నారు..అటు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఉన్నారు. దీంతో రవికి సీటు డౌటే.. కానీ తన తండ్రిని ఓడించాలని రవి టిడిపిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి మాడుగులలో ఏం జరుగుతుందో.