గత ఎన్నికల్లో జనసేన వల్ల టిడిపి నష్టపోయిన సీట్లు చాలానే ఉన్నాయి. దాదాపు 50 పైనే సీట్లలో జనసేన ఓట్లు చీల్చి టిడిపిని ఓడించింది..అలాగే వైసీపీని గెలిపించింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి రాకుండా టిడిపి సొంతంగా బలపడే దిశగా ముందుకెళుతుంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే మొదట టిడిపి సొంతంగా బలపడే దిశగా వెళుతుంది.
ఇక గత ఎన్నికల్లో టిడిపి ఎక్కడైతే దారుణంగా ఓడిందో..ఆయా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే దిశగా టిడిపి పనిచేస్తుంది. ఇదే క్రమంలో కాకినాడ పరిధిలో కూడా టిడిపి బలం పెంచుకుంటుంది. కాకినాడ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క పెద్దాపురం మినహా…మిగిలిన అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది.
అయితే అందులో జగ్గంపేట, తుని తప్ప మిగిలిన సీట్లలో జనసేన ఓట్లు చీల్చి వైసీపీని గెలిపించింది. కానీ ఈ సారి కాకినాడ పరిధిలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో టిడిపి ఇక్కడ సత్తా చాటాలని చూస్తుంది. లేటెస్ట్ సర్వేల ప్రకారం చూసుకుంటే కాకినాడలో టిడిపికే లీడ్ ఉందని తేలింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట సీట్లలో టిడిపికి గెలిచే అవకాశాలు ఉన్నాయి.
అటు తునిలో వైసీపీకి ఛాన్స్ ఉంది..కానీ ఇక్కడ టిడిపి పుంజుకుంటుంది. ఇక కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం సీట్లలో మూడు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. అయితే మూడు సీట్లలో జనసేన సింగిల్ గా గెలవడం కష్టం…టిడిపికైనా అంతే. అంటే టిడిపి-జనసేన కలిస్తే ఈ మూడు సీట్లని గెలుచుకోవడం ఖాయం. కాకినాడలో టిడిపి-జనసేన హవా ఉంటుందని చెప్పవచ్చు.