గత ఎన్నికల్లో భారీ భారీ మెజారిటీలతో గెలిచిన స్థానాల్లో ఇప్పుడు వైసీపీకి రివర్స్ అవుతుంది. అప్పుడు జగన్ హామీలని నమ్మడం, టిడిపిపై వ్యతిరేకత ఉండటం, జనసేన ఓట్లు చీల్చిన ప్రభావంతో..పలు స్థానాల్లో వైసీపీకి భారీగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి భారీ మెజారిటీలు వచ్చాయి.
అలా భారీ మెజారిటీలతో గెలిచిన స్థానాల్లో సీన్ రివర్స్ అవుతుంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, వైసీపీలో గ్రూపు తగాదాలు పెద్ద మైనస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో కూడా అదే పరిస్తితి ఉంది. పత్తికొండ అనేది టిడిపి కంచుకోట..ఇక్కడ టిడిపి ఆరుసార్లు గెలిచింది..అంటే పత్తికొండలో టిడిపికి పట్టు ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ బలం ఎక్కువ.
అయితే గత ఎన్నికల్లో కృష్ణమూర్తి హవా పనిచేయలేదు. టిడిపి నుంచి కేఈ తనయుడు శ్యామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి శ్రీదేవి పోటీ చేసి 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇంత మెజారిటీ రావడానికి సెంటిమెంట్, జగన్ గాలి కారణం. అంత మెజారిటీతో గెలిచి ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారా? అంటే అదేం లేదు. పైగా ఎమ్మెల్యేల బంధువుల అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. అసలు గ్రాఫ్ డౌన్ అయిన ఎమ్మెల్యేల లిస్టులో శ్రీదేవి ఉన్నారని సమాచారం.
నెక్స్ట్ ఈమె గెలవడం కష్టమనే పరిస్తితి ఉంది. పైగా ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆల్రెడీ కర్నూలు సీటు కోసం ట్రై చేస్తున్నారు..అది దక్కకపోతే పత్తికొండ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో టిడిపి నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి మూడుసార్లు పత్తికొండ నుంచి గెలిచారు. సుబ్బారెడ్డి తనయుడే మోహన్ రెడ్డి..అందుకే ఆయన పత్తికొండపై ఫోకస్ పెట్టారు. జగన్ ప్రధాన అనుచరుడు పోచంరెడ్డి మురళీ ధర్ రెడ్డి, తుగ్గలి నాగేంద్ర…ఇలా పలువురు సీటు కోసం చూస్తున్నారు. అయితే ఇక్కడ టిడిపికే గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.