ఈ సారి అసెంబ్లీ స్థానాల్లో గెలవడంతో పాటు మెజారిటీ ఎంపీ స్థానాలని కూడా గెలుచుకోవడం టిడిపికి కీలకమనే చెప్పాలి.ఎంపీ సీట్లతో కేంద్రంలో కీలక పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి. బిజేపికి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు గెలిస్తే టిడిపికే ప్లస్. అందుకే చంద్రబాబు ఎంపీ సీట్లపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఆయా సీట్లలో బలమైన అభ్యర్ధులని దింపాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే గెలుపు అవకాశం ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు ఎంపీ సీట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఆ జిల్లాలో గుంటూరు, నరసారావుపేట, బాపట్ల ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో గుంటూరు, బాపట్ల టిడిపి డౌట్ లేకుండా గెలిచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. నర్సరావుపేటలో కూడా ఛాన్స్ ఉంది…కాకపోతే వైసీపీతో కాస్త పోటీ ఉంటుంది. ఏదేమైనా ఆ సీటు కూడా టిడిపి ఖాతాలోనే పడేలా ఉంది.
కాకపోతే ఆయా సీట్లలో అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేదు. ఎలాగో గుంటూరులో సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ ఉండటంలేదు. దీంతో సీటు విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే చర్చ సాగుతుంది. కానీ గల్లాని తప్పించి మరొకరికి సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇటు నరసారావుపేట సీటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఇచ్చే ఛాన్స్ కనిపించడంలేదు. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ని నిలబెడతారని టాక్. కానీ ఇంకా క్లారిటీ లేదు.
ఇటు బాపట్ల ఎంపీ సీటులో మాజీ మాల్యాద్రి ఉన్నారు. ఆయనకు ఈ సారి సీటు ఇవ్వకపోవచ్చు అని ప్రచారం వస్తుంది. దీంతో అక్కడ ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. చూడాలి మరి ఆ మూడు సీట్లలో ఎవరు నిలబడతారో